కరోనా కాలంలో చాలామంది బలమైన ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. రోగ నిరోధక శక్తి కోసం శక్తినిచ్చేవాటిని తీసుకుంటున్నారు. తక్షణ కావాలంటే ఉడకబెట్టిన శనగలు తినాలని చెప్తున్నారు న్యూట్రిషీయన్స్. రోజూ ఒక కప్పు మోతాదులో తీసుకుని వాటిని ఉడకబెట్టుకుని తింటే శరీరానికి శక్తి వస్తుంది. పోషకాలు అందుతాయి.
చెడు కొలెస్ట్రాల్ దూరం
వీటిలో పాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న ఉప్పును బయటికి పంపుతుంది. కిడ్నీల పనితనం మెరుగు పడుతుంది. పచ్చ కామెర్లు ఉన్న వారు శనగలను తింటే త్వరగా కోలుకుంటారు. శనగల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.
నాన్ వెజ్ తినలేనివాళ్ల కోసం.
నాన్వెజ్ తినలేని వారికి శనగలను ఒక వరమని చెప్పవచ్చు. ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్లన్నీ శనగలలో లభిస్తాయి. రోజూ కప్పు శనగలను తింటే శరీరానికి కావల్సిన ప్రోటీన్లన్నీ లభిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

ఎముకల ఆరోగ్యానికి
శనగలు ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తాయి. ఎందుకంటే వీటిల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అలాగే విటమిన్ కె వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అన్ని పోషకాలు శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి అవసరం. కాల్షియం లేమితో బాధపడేవారు శనగలను తినడం వల్ల ఫలితం ఉంటుంది.
ఎర్ర రక్తకణాల సంఖ్య పెంపు
శనగలను తరచూ తింటుంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో రక్తం బాగా పడుతుంది. ఇది రక్తహీనత ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇవి చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. దీంతో నిద్రలేమి దూరమవుతుంది. అంతేకాదు ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి.












