రాష్ట్రంలో జరగబోతున్న గ్రాడ్యయేట్ ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులెవరన్నదాని పై ఉత్కంఠ తొలగడం లేదు. అంతా స్పష్టాస్పష్టంగా ఉంటోంది. ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. అయినా ఎవరికి వారు తమ పని చేసుకు పోతున్నారు. పార్టీ టికెట్ ఇచ్చినా సరే … ఇవ్వక పోయినా భవిష్యత్తులో ఈ సన్నద్ధత పనికి వస్తుందన్న భావనలో ఉన్నారు ఆశావాహులు. అయితే అనధికారికంగా ఇప్పటికే అన్ని పార్టీలో అభ్యర్థులు ఎవరన్నది చూచాయిగా తెలిసిపోయింది. అయితే ఆధికారికంగా పేర్లు ప్రకటించడం లేదన్న చర్చ సాగుతోంది ఆయా పార్టీల్లో.
టికెట్ కోసం వ్యూహాలు…
ఏ ఎన్నిక వచ్చినా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకునేది టీఆర్ఎస్ పార్టీ . అభ్యర్థులు ఎవరన్నది సంబంధం లేకుండా పార్టీని చూసి ఓట్లు వచ్చే ఎన్నికలు ఇవి. దీంతో అభ్యర్థులు టికెట్ తమకే వచ్చేలా అంతర్గతంగా వ్యవహారాలు నడిపిస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ లోనూ ఇదే తంతు కొనసాగుతోంది.
పేరు మాత్రం ప్రకటించకండి సార్….
వరంగల్ , ఖమ్మం, నల్గొండ స్థానానికి ఆ పార్టీ అభ్యర్థిని అంతర్గతంగా ఖరారు చేసినట్టు చెబుతున్నారు. అయితే ఇప్పటి నుంచే ఎమ్మెల్సీ అభ్యర్థి తానే అని ప్రకటిస్తే ఖర్చు తడిసి మోపెడవుతుందన్న భావనలో ఉన్నారు . దీంతో నామినేషన్ గడువు ముగిసే సమయం వరకు తన పేరు ప్రకటించ వద్దని అదిష్ఠానం వద్ద చెప్పుకున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థి పేరు ప్రకటిస్తే ఆ నాటి నుంచే ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలి. కార్యకర్తలు, ప్రకటనలు, మంది మార్బలం వెంట తిరగక పోతే ఓట్లు వేసేందుకు ఎవరూ ఆసక్తి చూపరన్నది నేతల భావన . ఇంత మందిని ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల వరకు పోషించాలంటే లెక్కకు మించిన ఖర్చుతో కుదేలు కావడం ఖాయం. అందుకే అభ్యర్థిగా ప్రకటన చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారు ఆ నేత.
అధికార పార్టీయేగా..ఓట్లు ఖాయం…
అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ప్రజలు కచ్చితంగా ఆ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తారన్న నమ్మకం ఆ నేతలో ఉంది. పెద్దగా ప్రచారం చేయక పోయినా పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తిగా ఆయనకు ఓట్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అంతే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను స్వయంగా కేటీఆర్ తనపైన వేసుకోవడంతో ఆ నేతకు పని మరింత సులువైందని భావిస్తున్నారట. అంతే కాకుండా కేసీఆర్ సైతం నియోజక వర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎన్ రోల్ మెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని.. పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీదేనని చెప్పడంతో ఆయా నియోజక వర్గ ఎమ్మెల్యేలే ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అభ్యర్థుల్ని గెలిపించే పని మీదేసుకుంటారు. దీంతో తనకు ఎలాంటి ఖర్చు లేకుండానే ప్రజాప్రతినిధిగా మారిపోవడం ఖాయం అనుకుంటున్నారు సదరు











