నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఉచితంగా పంపిణీ చేస్తున్నమందు,వాటి తయారీ విధానాలను ఆయుష్ వైద్య నిపుణుల బృందం పరిశీలించింది.ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందు ఆయుర్వేద మందులుగా గుర్తించలేమని, వీటిని నాటు మందులుగా గుర్తిస్తున్నట్టు ఆయుష్ కమిషనర్ కల్నర్ రాములు ప్రకటించారు.వీరి పర్యటకు ముందే ఆనందయ్య మందులను హైదరాబాద్లోని ల్యాబ్లో పరీక్షించారు.ల్యాబ్ పరీక్షల్లో వచ్చిన వివరాలు,ఆనందయ్య చెప్పిన దానిని పరిశీలించి నాటు మందుగా గుర్తించినట్టు ఆయుష్ శాఖ కమిషనర్ కర్నల్ రాములు ప్రకటించారు.అయితే ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుల్లో హానికారణాలు ఏమీ లేవని తెలిపారు.వారు వంశపారంపర్యంగా నాటు మందులు పంపిణీ చేస్తున్నారని వారు గుర్తు చేశారు.ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందులను ఆయుర్వేద మందులుగా మాత్రం గుర్తించలేమని రాములు ప్రటించారు.
ప్రత్యక్ష పరిశీలన చేశాం..
ఆనందయ్య పచ్చకర్పూరం,పసుపు,నల్లజీలకర్ర,వేపఇగురు,మారేడు ఇగురు,ఫిరంగిచెక్క,దేవరబండి వంటి మొక్కల ముడిపదార్ధాలతో మందులు తయారు చేస్తున్నట్టు గుర్తించారు.ఆనందయ్య తనకున్న అనుభవంతో పిడికిలితో ఈ పదార్థాలను కలిపి,పౌడరు తయారు చేస్తున్నారని ఆయుష్ కమిషనర్ కర్నల్ రాములు ప్రకటించారు.ఆనందయ్య తయారు చేస్తున్న మందు స్వీకరించేందుకు వేలాది మంది కృష్ణపట్నం తరలిరావడంతో అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు.ప్రభుత్వ అనుమతి లభించాక మందులు ఉచితంగా పంపిణీ చేస్తానని ఆనందయ్య ప్రకటించారు.










