వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుమారోసారి ఫైర్ అయ్యారు.రాజ్యసభకు వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్ పై అయ్యన్న సెటైర్లు సందించారు. విజయసాయి రెడ్డికి సరైన లెక్కలు రాసే లింక్ తెగిపోయిందంటూ తన ట్వీట్ లో చురకలు అంటించారు. ఇప్పటికే ట్విటర్ వేదికగా అధికార పార్టీ వైసీపీకి చెందిన కీలక నేతలపై విమర్శలు సంధిస్తూ వస్తున్న అయ్యన్న తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
విజయసాయి రెడ్డి రాజ్యసభకు దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్ లో తనపై 8 ఈడీ, 11 సిబిఐ కేసులున్నాయని పేర్కొన్నారు. కాగా, తన కుటుంబ ఆస్తుల విలువ 21.57 కోట్ల రూపాయాలని, వాటిలో వ్యవసాయ, వ్యవసాయేతర , నివాస భవనాల విలువ 21.42 కోట్లుగా ఆయన వెల్లడించారు. అయితే విజయసాయి రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ పై అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో స్పందించారు.
రోజూ నీతులు చెప్పే, ఏ2 కేటు గాడి అసలు చరిత్ర.. ఇతడికి మెదడుకి, చేతికి ఉండాల్సిన “సరైన లెక్కలు” రాసే లింక్ తెగిపోయింది. తప్పుడు లెక్కలు రాసి ఇలా తయారయ్యాడు. ఇతన్ని ఎక్కడా చూపించనక్కర్లేదు. జగన్ రెడ్డితో ఉంటే ఒకరికి ఒకరు మందులు టైం కి ఇచ్చుకోవచ్చు..అంటూ అయ్యన్న పాత్రుడు తన ట్వీట్ లో వ్యంగ్యాస్త్రాలు సందించారు.











