త్వరలోనే సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలను పూర్తిగా సేకరించామని, ముఖ్యనేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ స్కాంలు చూశాకే సీఎం కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయిందని బండి అన్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ చేరడం దాదాపు ఖాయమైంది. ఈటల వ్యవహరమై బండి స్పందిస్తూ.. త్వరలో రాజేందర్ బీజేపీలో చేరుతారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ను వ్యతిరేకించేవాళ్లందరికీ బీజేపీ అండగా ఉంటుందని ఆయన అన్నారు.











