సోమవారం టీడీపీ నాయకులతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందని, సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించినట్లు చెప్పారు. ఇతర వైరస్ల కన్నా 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని చంద్రబాబు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో బెడ్లు, మందుల పంపిణీతో పాటు వైద్యుల నియమాకాలు కూడా చేపట్టాలన్నారు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు జగన్ ప్రభుత్వం నిద్రపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ లో ఏపీ వెనుకబడి పోయిందని చంద్రబాబు అన్నారు.











