ఏపీ సిఎం జగన్ ఒక అపరిచితుడులా వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రానికి విభజన కంటే ఎక్కువ నష్టం జరుగుతోందని విమర్శించారు టిడిపి అధినేత చంద్రబాబు.తెలుగుదేశం స్ట్రాటజీ కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జగన్ మోసపు రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారమయంగా తయారయ్యాయని ఆయన మండిపడ్డారు. ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడానికే వాలంటీర్లను పెట్టాను అని చెప్పిన జగన్…. ఇప్పుడు మొదటి వారంలో కూడా పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ బలహీనత ఏంటో క్యాబినెట్ విస్తరణ చూస్తేనే అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్టుకు శాపంగా మారాయని వివరించారు. జగన్ అధికారంలోకి వస్తే ఏదో చేస్తారని భావించిన సొంత వర్గం కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉందని ఆయన పేర్కొన్నారు.పోలవరం అంశంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్ట్ కు శాపంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ ఎంత బలహీనుడో అతని క్యాబినెట్ విస్తరణ చూస్తేనే అర్థం అవుతుందన్న చంద్రబాబు..వైసీపీలో ఉన్న డొల్లతనం, అసంతృప్తి క్యాబినెట్ విస్తరణ సందర్భంగా బయటపడిందన్నారు. బ్లాక్ మెయిల్ చేసిన వారికి భయపడి జగన్ పదవులు ఇచ్చారన్న ప్రచారం సొంత పార్టీలోనే వినిపిస్తోందని ఎద్దేవా చేశారు. నెల్లూరు కోర్టులో దొంగల వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాని హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి మూడేళ్లు దోచుకుతిన్నారని, ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా? అని ప్రశ్నించారు.