కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు తిరిగేసరికి, సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో తనదైన మార్క్ చూపించారు. ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు నిలిచిపోయిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ (LMC), వెలిగొండ ప్రాజెక్టులను పరుగులు పెట్టించి, రికార్డు స్థాయిలో ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ జలయజ్ఞంతో రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ చంద్రబాబు గ్రాఫ్ ఒక్కసారిగా పీక్స్కి దూసుకుపోయింది.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ఎడమ కాలువ పనులను చంద్రబాబు మొదటి నుంచి అత్యంత సీరియస్గా తీసుకున్నారు. గతంలో రాజకీయ అడ్డంకులు, జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల నలిగిపోయిన ఈ ప్రాజెక్టుకు సీఎం స్వయంగా పట్టుపట్టి మరీ జీవం పోశారు. ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు చేస్తూ, క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయడంతో తొలి దశ విజయవంతంగా పూర్తయింది. దీంతో ఉత్తరాంధ్ర రైతుల మొఖాల్లో దశాబ్దాల తర్వాత అసలైన ఆనందం వెల్లివిరుస్తోంది.
ఇక ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల కన్నీళ్లు తుడిచే వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ బాబు అదే జోరు చూపించారు. టన్నెల్స్ తవ్వకంలో ఎదురైన కఠినమైన అడ్డంకులను, సాంకేతిక సమస్యలను పట్టుదలగా అధిగమించి తొలి ఫేజ్ పనులను విజయవంతంగా ముగించారు. కరువు సీమలో పచ్చని పంటలు పండించాలనే రైతుల దశాబ్దాల కల బాబు చొరవతో నిజరూపం దాలుస్తోంది.
మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపడమే అసలైన నాయకుడి లక్షణం అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. ఇన్ని రోజులు పనులు ఆగిపోయి నిరుత్సాహంలో ఉన్న ప్రాజెక్టులను ఇలా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించడం చూసి ప్రజలు ఫిదా అవుతున్నారు. సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో ఆయనకున్న అంకితభావం ఈ ప్రాజెక్టుల విజయంతో మరోసారి రుజువైంది.
ఈ మాస్టర్ స్ట్రోక్తో ప్రజల్లో చంద్రబాబుపై ఉన్న నమ్మకం రెట్టింపు కావడమే కాకుండా, ఆయన పొలిటికల్ గ్రాఫ్ గ్రాండ్గా అప్గ్రేడ్ అయింది. ఈ వేగంతో ప్రాజెక్టులు పూర్తవుతుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందనే భరోసా ప్రజల్లో బలపడింది.











