చలికాలంలో మాచర్లలో రాజుకున్న రాజకీయ సెగలు..!
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గంలో గత దశాబ్ధనర కాలం పైగా రాజకీయమంతా.. పిన్నెల్లి కుటుంబ చేతుల మీదిగానే నడుస్తోంది. 2004 నుంచి ప్రస్తుతం వరకు పిన్నెల్లి వారుసులే ఇక్కడ రాజకీయాల్లో పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలోనే పాలన బాధ్యతలు నిర్వర్తిస్తూ.. మరోపక్క రాజకీయ ప్రత్యర్థులను సైతం సైడ్ ట్రాక్ చేస్తూ వస్తున్నారు. టీడీపీ తరుఫున గతంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి దుర్గాంబ, ఆమె తనయుడు బ్రహ్మానందరెడ్డి తరువాత ఆ స్థాయి ఢీకొట్టే నేత మాచర్ల లో ఇంత వరకు కనిపించలేదు. టీడీపీ నేతలు చలమారెడ్డి, అంజిరెడ్డి, కుర్రి పున్నారెడ్డి వంటి వారు పార్టీని బ్రతికించి, ముందుకు తీసుకెళ్లారే తప్పా.. పార్టీ విజయాలకు బాటలు వేయలేకపోయారు. ఇందుకు కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదిపత్యం ధోరణి, రౌడీ రాజకీయమే కారణంగా అభివర్ణిస్తారు విశ్లేషకులు! ఈ క్రమంలో ఏపీలో తిరిగి అధికారంలోకి పార్టీని తీసుకురావాలని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కేంద్ర కార్యాలయం సిట్టింగ్ వేసి, 175 నియోజవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపధ్యంలోనే మాచర్ల కు గట్టిన నాయకత్వం లేకుంటే ఈ సారి ఎన్నికల్లో పార్టీ పరాజయం తప్పదని నియోజకవర్గం నుంచి మేజారిటీ అభిప్రాయాలు స్వీకరించిన తరువాత పార్టీ మాచర్ల ఇంఛార్జీగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డిని ప్రకటించింది. నాటి నుంచి మాచర్ల లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
తిరుగులేని నాయకత్వం బ్రహ్మారెడ్డి సొంతం..!
మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాస్ లీడర్. తనకు ఎదురులేదు.. తిరుగులేదు.. అని భావించే ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. అవసరమనుకుంటే భౌతిక దాడులకు సైతం పాల్పడుతుంటారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి గట్టి కౌంటరిచ్చే లీడర్ ను ఎంపిక చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు భావించారు. పీఆర్కేకు సమఉజ్జిలాంటి నాయకుడు బ్రహ్మారెడ్డేనని తలచి, మాచర్ల ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు పీఆర్కే పై కూడా నియోజకవర్గం వ్యాప్తంగా పూర్తిస్థాయిలో వ్యతిరేక కనిపిస్తోంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పార్టీ రెండు నుంచి మూడు వర్గాలు చీలి.. పెత్తనం కోసం కొట్టుకుంటున్నారు. వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొనగా.. మరోవైపు తెలుగుదేశం పార్టీ కేడర్ లో కూడా తప్పనిసరిగా ఈ సారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బలంగా సంకల్పిస్తోంది! అలానే బ్రహ్మారెడ్డి కూడా తనదైన శైలిలో దూకుడు రాజకీయాలు మొదలుపెట్టారు. దుర్గి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతకు యత్నించి ఘటనలో బ్రహ్మారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దఎత్తున శ్రేణులను కూడకట్టుకుని దుర్గిలో నిరసన తెలిపేందుకు వస్తున్న బ్రహ్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రహ్మారెడ్డి అరెస్ట్ ను టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి, పోలీసు చర్యలను ఖండించారు. బ్రహ్మారెడ్డి నాయకత్వంలో పార్టీ ఈ సారి మాచర్ల నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా మారబోతుందని కేడర్ బలంగా నమ్ముతోంది!