వేల కోట్లు ఏమైయ్యాయి?
ఏపీలో నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు అధునీకరణ, కేంద్ర నిధులతో చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను కాంట్రాక్టర్లుకు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. దీంతో కాంట్రాక్టర్లు బిక్షాటన చేసి, పలు జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డెక్కి ప్రభుత్వం తీరును ప్రశ్నించారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో హైకోర్టు మెట్లెక్కారు. విచారణ చేపట్టిన హైకోర్టు అనేక మార్లు ప్రభుత్వం కాంట్రాక్టర్లు పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించింది. చెల్లించాల్సిన బిల్లును ఎందుకు చెల్లిచడంలేదని నిలదీసింది. మంగళవారం దీనిపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్శ హైకోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వ కాంట్రాక్టులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపోతే ఎలా అని సీఎస్ ను హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సీఎస్ బదులిస్తూ.. ప్రాధాన్యత క్రమంలో బిల్లులు చెల్లిస్తున్నామని ధర్మాసనానికి ఆయన విన్నవించారు.
అలా చేస్తే పనులు చేసేందుకు ఎవరు ముందుకొస్తారు?
ఏపీ ప్రభుత్వం బకాయిపడిన బిల్లులపై కాంట్రాక్టర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ వహిస్తున్న జాప్యంపై సీఎస్ ను ప్రశ్నించింది ధర్మాసనం. ఈ సందర్భంగా హైకోర్టులు పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. బిల్లుల చెల్లింపులో కాంట్రాక్టర్లకు 9వ ప్రాధాన్యత ఇస్తే.. పనులు చేసేందుకు ఎవరు వస్తారని ప్రశ్నించింది. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించపోవడం కారణంగా కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాళ్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని పిటిషనర్ తరుఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే దీనిపై కోర్టుకు సీఎస్ సమీర్ శర్మ బదులిచ్చారు. ప్రాధాన్యత క్రమంలో బిల్లులు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. స్పందించిన కోర్టు బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్య క్రమంలో చివర్లో పెడుతున్నారని వ్యాఖ్యానించింది. బిల్లుల సకాలంలో చెల్లించేలా కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వాలని.. ఉన్నత న్యాయం స్థానం సీఎస్ ను ఆదేశించింది. ఏపీలో మొత్తం జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు రూ.30 వేల కోట్ల మేరకు బిల్లులను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం!
Must Read:-అశోక్బాబు అరెస్టుపై సీఐడీకి హైకోర్టులో కీలక ఆదేశాలు..











