అన్ని దేశాలు ‘అమెరికా పని అయిపోయింది’ అనుకున్నాయి. ఆ దేశంలో అడుగుపెట్టకపోవడం మంచిదని నిర్ణయించుకున్నాయి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో పౌరులు స్వేచ్చగా బయట తిరుగుతున్నారు. సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడం లేదు. ఇతంలా మార్పు రావడానికి కారణం ఆ దేశ ప్రసిడెంట్ బెడెన్. అమెరికా బాధ్యతలు తీసుకున్నా బెడన్ మొదట కరోనాపై ఫోకస్ చేశారు. యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకున్నారు. ఫలితంగా అమెరికాలో కరోనా కేసులు తగ్గాయి. అందరూ వ్యాక్సినేషన్ కు ముందుకు రావడంతో మరణాల రేటు తగ్గింది. దీంతో కరోనా టీకాలు వేసుకున్న వ్యక్తులు మాస్క్ లు ధరించాల్సిన అవసరం లేదని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది. రెండు డోసులు టీకా తీసుకున్న వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చని చెప్పింది. దీంతో అమెరికా పౌరులు హాయిగా, స్వేచ్ఛగా బయటకు తిరుగుతున్నారు. వీకెండ్స్, సినిమాహాళ్లు, పబ్బులకు వెళ్తున్నారు. కరోనా వేళ.. అగ్రరాజ్యం తీసుకున్న చర్యలను ఇతర దేశాలు సైతం పాటిస్తున్నారు. కరోనాపై అసాధారణ విజయం సాధించింది శభాష్ అనిపించుకుంది అమెరికా.
The CDC announced that they are no longer recommending that fully vaccinated people need to wear masks. pic.twitter.com/pFhJEtBepq
— Joe Biden (@JoeBiden) May 13, 2021











