తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ ప్రతి విషయంలో అన్యాయమే చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. వరంగల్ జిల్లా కాజీపేటలో రైల్వే కోచ్ల కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో యూపీఏ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. దానిని ఎన్డీయే ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఆ ప్రాజెక్టు అవసరమే లేదనడం సరికాదన్నారు.
పోరాటానికి సిద్ధం..
కేంద్రం వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులను దగా చేసిందని కేటీఆర్ అన్నారు. కోచ్ల కర్మాగారం తెలంగాణ రాజ్యాంగపరమైన హక్కని చెప్పారు. రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెరాస ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తారని పేర్కొన్నారు.
బీజేపీ నమ్మక ద్రోహం: కేటీఆర్
రైల్వే కోచ్ లపై కేంద్రం తీరు సరికాదు. అది తెలంగాణ ప్రజల దశాబ్దాల కల. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో అదికూడా ఒకటి. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రధాని మోడీని కేసీఆర్ స్వయంగా కలిశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రత్యేకంగా విన్నవించారు. దాని ఆవశ్యకతను వివరించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలు సేకరించి రైల్వే శాఖకు కూడా అప్పగించింది. కానీ.. ఇటీవలే రైల్వేకోచ్ అవసరం లేదని రైల్వేశాఖ పేర్కొంది. ఈమేరకు ఒక సమాచార హక్కు పిటిషన్కు సమాధానం ఇచ్చింది. ఇది ముమ్మాటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహమే.
Must Read ;- మోడీ పేరెత్తితే కేసీఆర్కు వణుకు: రేవంత్