Nara Lokesh Comments On AP DJP :
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసుల చేత టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టులు చేయిస్తూ రాక్షస ఆనందం అనుభవిస్తోంది. తాజాగా మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ జరుగుతోందంటూ టీడీపీ రుజువు చేసింది. దానిని పరిశీలించేందుకు దేవినేని ఉమ సహా టీడీపీ బృందం వెళ్ళింది. ఆ సమయంలో కొండూరు వద్ద వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. మాజీ మంత్రి దేవినేని ఉమా కారు అద్దాలు పగిలాయి. ఆయనకు మద్దతుగా పలువురు టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆందోళన చేశారు. ఇరువర్గాలను కట్టడి చేయాల్సిన పోలీసులే ఒక్క వర్గానికే కొమ్ముకాస్తూ టీడీపీ నాయకులపై లాఠీచార్జి చేయడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. ఉమపై దాడి జరిగిందంటూ మాజీ సీఎం చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాసినా పోలీసులకు చీమకుట్టినట్టుగా లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
బలవంతంగా అరెస్ట్
దేవినేని ఉమతో పాటు పట్టాభి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ లను బలవంతంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దేవినేని ఉమను పెదపారుపూడి పోలీస్ స్టేషన్ నుంచి నందివాడ పీఎస్కు తరలించడం.. నందివాడ గ్రామ సరిహద్దులను పోలీసుల తమ అధీనంలో తీసుకోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. మీడియాను కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు పోలీసులు అనుమతించలేదు. పీఎస్ పరిసర ప్రాంతాలకు ఎవరూ రాకుండా బారికేడ్లు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలను వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టడం పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండారం బయటపెట్టినందుకేనా?
కొండపల్లి ఫారెస్టులో అక్రమ మైనింగ్ తో వేలకోట్లు కొల్లగొట్టిన వసంత వీరప్పన్ బండారం బయటపడిందని, నిర్వాసితుల పక్షాన నిలిచి సర్కారుని నిలదీస్తున్నారనే సజ్జల బ్యాచ్ దాడికి పాల్పడిందని నారా లోకేశ్ ఆరోపించారు. అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారనే కారణంతోనే అధికార పార్టీ దేవినేనిపై కక్ష కట్టిందని, మాజీ మంత్రి పైనే వైసీపీ గూండాలు దాడికి పాల్పడితే పోలీసులు ఏమయ్యారని ? చట్టం ఎవరి చుట్టమైంది? ప్రశ్నిస్తే చంపేస్తారా? అని నారా లోకేశ్ ఏపీ డీజీపీని ప్రశ్నించారు.
Must Read ;- టీడీపీ కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు!
అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారని అధికారపార్టీ దేవినేని ఉమాగారిపై కక్ష కట్టింది. మాజీమంత్రి పైనే వైసీపీ గూండాలు దాడికి పాల్పడితే పోలీసులు ఏమయ్యారు? చట్టం ఎవరి చుట్టమైంది? ప్రశ్నిస్తే చంపేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? @ysjagan స్వామ్యమా? డిజిపి సమాధానం చెప్పాలి.(2/2)
— Lokesh Nara (@naralokesh) July 27, 2021











