టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆదిరెడ్డి కోట్లమ్మకు నివాళులర్పించారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ్నుంచి భారీ ర్యాలీతో సామర్లకోటకు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలు ఆవిష్కరించి కార్యకర్తలనుద్దేశించి మట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ చేసిన సేవలను నారా లోకేశ్ గుర్తుచేశారు.
వడ్డీతో సహా చెల్లిస్తాం
వైసీపీ ప్రభుత్వంలో రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయని లోకేశ్ మండిపడ్డారు. పాదయాత్ర సమయంలో అన్నీ పెంచుకుంటూ పోతున్నారని టీడీపీపై విమర్శలు చేసినా.. జగన్ గారూ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చెత్త ప్రభుత్వానికి చెత్త ఆలోచనలే వస్తాయని, అందుకే చెత్తపై పన్ను.. ఇంటి పన్ను అంటూ ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. విద్యుత్ చార్జీల మొదలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని, టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీకి వడ్డీతో సహా అన్ని చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారం అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకులను ఏం చేయలేరన్నారని, టీడీపీ కార్యకర్తల గడ్డం కాదు కదా వెంట్రుక కూడా పీకలేరని సవాల్ విసిరారు. ఈ చెత్త ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
Must Read ;- జగన్రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కులేదా?
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆదిరెడ్డి. కోట్లమ్మ గారికి నివాళులర్పించి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారి కుటుంబాన్ని పరామర్శించాను.(1/2) pic.twitter.com/J7fpYPy0uK
— Lokesh Nara (@naralokesh) July 27, 2021











