వివేకా హత్యలో తనకుగానీ, తమ కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి పాత్ర లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి సాక్షిగా ప్రమాణం చేశారు. చెల్లికి న్యాయం చేయలేనివాడు మహిళలకు ఏ న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే, అలిపిరి దగ్గర ప్రమాణం చేశామనన్నారు. ‘‘ఛాలెంజ్కి భయపడి పులివెందుల పిల్లి పారిపోయింది. బాబాయ్ని వేసేసింది అబ్బాయే’’ అని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Must Read ;- రక్త చరిత్ర మాది కాదు.. వివేకా హత్యపై వెంకన్నసాక్షిగా లోకేష్ ప్రమాణం
సవాల్ చేసా వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసా. ఛాలెంజ్ కి భయపడి పులివెందుల పిల్లి పారిపోయింది. ఈ రోజు బాబాయ్ మర్డర్ మిస్టరీ వీడిపోయింది. బాబాయ్ ని వేసేసింది అబ్బాయే.#WhoKilledBabai pic.twitter.com/IioFufn6jm
— Lokesh Nara (@naralokesh) April 14, 2021










