సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరిలేరు నీకెవ్వురు బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్, ‘గీత గోవిందం’ సూపర్ హిట్ తర్వాత దర్శకుడు పరశురామ్ చేస్తున్న సినమా కావడంతో .. భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజులు క్రితం దుబాయ్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం.. రెండో షెడ్యూల్ ను త్వరలోనే హైద్రాబాద్ లో మొదలు పెట్టబోతోంది. ఆ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదిక గా తెలియచేశారు.
ఈ షెడ్యూల్ లో హీరో మహేశ్ బాబు తో పాటు హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా షూటింగ్ లో జాయిన్ అవుతారట. దుబాయ్ షెడ్యూల్ లో కూడా కీర్తి సురేశ్ నటించింది. ఇప్పుడు తాజా షెడ్యూల్లో వీరిద్దరి పై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. కరోనా సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతూ షూటింగ్ జరుపబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమా మహేశ్ కు ఏ రేంజ్ సినిమా అవుతుందో చూడాలి.
SuperStar @urstrulymahesh joins #SarkaruVaariPaata 2nd Schedule today with all necessary safety precautions 💥#HappyUgadi 😊@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/kerp3YcaL8
— BARaju (@baraju_SuperHit) April 13, 2021