పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్కి వైసీపీ అధినేత జగన్ హ్యాండ్ ఇచ్చారు.. ఇప్పటికే చాలా మందికి టికెట్లు ప్రకటించారు జగన్. 60 మందికి పైగా అభ్యర్ధుల లిస్ట్ని వెల్లడించారు.. ఈ లిస్టులో మంత్రి అమర్నాధ్ టికెట్ లేదు.. గత ఎన్నికలలో ఆయన పోటీ చేసిన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి భరత్ని రంగంలోకి దింపారు.. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభ సాక్షిగా భరత్ పేరును ప్రకటించి, అమర్నాధ్కి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు.. అమర్నాధ్ తనకు తమ్ముడి లాంటి వాడని, తన గుండెల్లో పెట్టుకుంటానని తెలిపిన జగన్.. ఆయన టికెట్ అంశంపై మౌనాన్ని ఆశ్రయించారు..
మంత్రి అమర్ నాధ్పై భారీ వ్యతిరేకత ఉంది. మంత్రిగా ఆయన విఫలం అయ్యారనే నివేదికలు ఉన్నాయి.. ఆయనపై నియోజకవర్గ ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉంది.. మంత్రిగా ఆయన చేసిన పలు కామెంట్స్ కూడా నెగిటివ్గా మారాయి.. పరిశ్రమలు ఎక్కడ అని విలేకరులు ప్రశ్నించగా, ఆయన చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైసీపీ సర్కార్ పరువు తీసింది.. గుడ్డు పెట్టగానే కోడి వస్తుందా?? అంటూ ఆయన నిలదీయడంతో.. ఆయనను గుడ్డు మంత్రిగా ట్రోల్ చేసింది ప్రతిపక్ష సోషల్ మీడియా.. ఇటు, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించిన సమయంలోనూ అమర్ నాధ్ చెప్పిన సమాధానం దుమారంగా మారింది..
అంతేకాదు, కాపు సామాజిక వర్గానికి చెందిన అమర్నాధ్ని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కోసం జగన్ వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి.. ఇది కూడా ఆయనకు సొంత సామాజిక వర్గంలో విమర్శలు, వ్యతిరేకత తీసుకువచ్చింది. ఇది కూడా అమర్నాధ్కి బెడిసికొట్టిందనే వ్యాఖ్యలు వినిపించాయి.. అందుకే, వైసీపీ టికెట్ ఇవ్వడం లేదని, ఆయన ఎక్కడ నిలబడినా ఓడిపోవడం ఖాయమనే భావనలోకి జగన్ వచ్చారని చెబుతున్నారు సొంత పార్టీ నేతలు..అందుకే, అమర్నాధ్కి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే, జగన్ తనకు అన్యాయం చేయడని, చివరి ఆశలు పెట్టుకున్నారు గుడివాడ అమర్నాధ్. అనకాపల్లి అసెంబ్లీ నుండి తనను తప్పించినా, అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం బరిలోకి దింపుతారని లెక్కలు వేసుకుంటున్నారు అమర్ నాధ్.. అందుకే, తనకి టికెట్ ఇవ్వకపోయినా, ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటున్నారని తెలుస్తోంది.. మరి, ఎంపీ టికెట్ ఇవ్వకపోతే, అమర్ నాధ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.