ఆలయాల విధ్వంసం, అన్యమత ప్రచారం, సనాతనంపై చిన్నచూపు..
జగన్ రెడ్డి రెండునరేళ్ల పాలనలో ఆలయాల విధ్వంసం, అన్యమత ప్రచారం, సనాతన ధర్మాలపై చిన్నచూపు అనే వాటిని రాష్ట్ర ప్రజలు చాలా దెగ్గరగా చూశారు. ఆలయాలతోపాటు విలువైన రథాలు ధ్వంసం చేసిన ఘటనలో ఈనాటి ఒక్క అరెస్ట్ కూడా జరగలేదన్నది వాస్తవం! అసలు ఈ కుట్రలు వెనుక ఉన్నది ఎవరు అన్నది క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి జగన్ రెడ్డి ప్రభుత్వానిది. ఇంతలా హిందూధర్మంపై జరుగుతున్నా.. దాడిపై ఆ సమయంలో కానీ, ప్రస్తుతం కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్క పత్రిక సమావేశం పెట్టి, హిందూ సమాజానికి ఒక్క భరోసా హామీ ఇవ్వలేక పోయాడు జగన్ రెడ్డి! ఓదార్పులు చేసి, పాదయాత్రలో నడిచి, ఒక్క ఛాన్స్ అంటుంటే.. ఇచ్చిన అవకాశం, నేడు రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ సలహదారు, మంత్రులు మినహా.. జగన్ రెడ్డి ఒక్కరోజైనా ప్రజలను పలకరించేందుకు మీడియా ముందుకు వచ్చిన దాఖలు లేవు. పార్టీ చూడలేదు.. ప్రజా ప్రతినిధులు ఏవరన్నది కూడా ఆలోచించలేదు..కేవలం రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో ఒక్క ఛాన్స్ అంటున్న జగన్ అనే వ్యక్తిని ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేశారు రాష్ట్ర ప్రజలు. కానీ నేడు ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, అభిమానాన్ని నిలపెట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ప్రజలతో పాటు అన్ని వర్గాల్లో జగన్ రెడ్డి విశ్వనీయత కొల్పోయ్యాడు అన్నది అక్షర సత్యం!
కళాకారుల పొట్టగొట్టే ప్రయత్నం!
సనాతన సంప్రదాయాలంటే గౌరవం లేదు.. హిందూ దేవుళ్లు, ఆలయాలు, వాటి చరిత్ర, సంస్కృతి, కళలు, కళాకారులు విలువ తెలియదు. ప్రజల కష్టాలను మరిపించి, సేద తీర్చే కళలు నేడు ఏపీలో అంతరించిపోతున్నాయి. జగన్ రెడ్డి ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నిత్యం ప్రభుత్వ వైఫల్యాలను కప్పింపుచ్చుకునేందుకు సామాజీక దుమారానికి తెరతీయడం కామన్ గా మారింది. ప్రజలు, మీడియా అటెన్షన్ను డైవర్స్ చేసే పాలిటిక్స్ పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం ఏపీలో సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, సచివాలయం సిబ్బందికి అందించాల్సిన ప్రొబేషన్ డిక్లరేషన్, జనవరిలో నిరుద్యోగులకు ప్రకటించాల్సిన జాబ్ క్యాలెండర్ వంటివి అనేక సమస్యల డైవర్షన్ కోసమే.. ‘‘సినిమా టికెట్ ధరల నియంత్రణ, థియేటర్లపై అధికారుల దాడులు, నేడు చింతమణి నాటక ప్రదర్శనను నిషేదిస్తూ.. జీవో విడుదల చేయడం’’ అని విపక్షాలు మండిపడుతున్నాయి. కళాకారులైతే.. ఒక్కడుగు ముందుకేసి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చింతామణి నాటకాన్ని నిషేదించే నైతిక హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1923 లో రాసిని చింతామణి నాటకం.. సామాజీక దురాచారాలను ప్రతిబింబిచేలా ఉంటుంది. వ్యామోహలతో తప్పుదోవపడితే జరిగే నష్టాన్ని చింతామణి నాటకం సారాంశం తెలుపుతోంది. సమాజానికి అవగాహన పరిచే గొప్ప దృశ్యరూప కథబాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా నిషేదిస్తుందని ప్రశ్నిస్తున్నారు. వందేళ్ల నుంచి ఆ నాటకంపై ఆధారపడి జీవనం సాగించే వందలాది కుటుంబాల జీవన పరిస్థితి ఎందుకు ఆలోచించడంలేదని నిలదీస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్, గుడివాడలో గోవా కేసినో వంటి వాటికి అనుమతులిచ్చి, సాంఘిక మార్పు కోసం ప్రయత్నించే చింతామణి నాటకాన్ని ప్రభుత్వం నిషేదించడం సమర్థనీయం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.