ఏపీ రాజకీయాలు వ్యక్తిత్వం హరించే దిశకు ఎప్పుడో దిగజారిపోయాయి. బూతుల అస్త్రాన్ని బయటకు తీయడం వైఛీపీ నీచ సంస్కృతికి అద్దం పడుతోంది.
ఏపీలో రాజకీయాలు ఎన్నికల ముందే వేడెక్కాయి. టీడీపీ, బీజేపీ అధికార వైసీపీతో యుద్దం చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై విషం చిమ్ముతున్నారు. విమర్శలు మాని.. వ్యక్తిగత దూషణలతో ఒంటికాలుపై లేవడం పట్ల వైసీపీ నీచ సంస్కృతిని చూస్తున్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి దివంగత ముఖ్యమంత్రి, అన్న ఎన్టీఆర్ గారాల పట్టి. తిరుగులేని రాజకీయ చతురత.., గర్జించే స్వరంతో ప్రత్యర్ధుల రాజకీయాలపై ప్రశ్నించే తీరు అన్న ఎన్టీఆర్ ను తలపిస్తోంది. ఎంపీగా.., కేంద్రమంత్రిగా చేసి.. బీజేపీలో క్రియాశీలక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.
అటువంటి పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయి వ్యక్తిగత విమర్శలు దిగారు. అది కూడా మద్యం.., ఇసుక లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే ఇటువంటి నీచ వ్యాఖ్యలు విజయసాయి పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇది సభ్య రాజకీయాలను ప్రశ్నించేలా ఉంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. అజ్ఞాన విధానాలతో ఇంకా వ్యక్తిత్వ హననం, బూతులతో మహిళా రాజకీయవేత్తలను బజారుకీడుస్తున్నారు. గతంలో కూడా ఏపీ అసెంబ్లీ సాక్షిగా మంత్రి అంబటి, మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ద్వారంపూడి వంటివారు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వ్యక్తిత్వం హననాకి పాల్పడ్డారు. నిండు సభలో గంట, అరగంట అంటూ మాట్లాడి.. భువనేశ్వరిని కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆనాడు నారా, నందమూరి కుంటుంబాల వారు కన్నీరుపెట్టుకున్నారు. నేడు ఆ కన్నీరే ఉప్పెనగా మారి జగన్ రెడ్డి నిరంకుశత్వ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ పోకడలను ఎండగడుతున్నాయి.
ఇదే తరహాలో పురంధేశ్వరిపై కూడా వ్యక్తిత్వ హననానికి సంబంధించిన వ్యాఖ్యలే విజయసాయి చేశాడు. పురంధేశ్వరి .. నీ గత చరిత్ర బయటకు తీస్తే తల ఎక్కడ పెట్టుకుంటావ్..?అంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నీ గురించి నోరు తెరిస్తే.. నీ జీవితం తల్లకిందులు అవుతోందని అన్న విజయసాయి వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన పురంధేశ్వరి విజయసాయిపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కు లేఖ రాశారు. పలు కేసుల్లో గత పదేళ్ళుగా విజయసాయి బెయిల్ పై ఉన్నారని.. బెయిల్ పై రాజకీయ పదవులు పొంది.. ప్రజలను, రాజకీయ నేతలను బెదిరిస్తూ.. సంఘ విద్రోహ శక్తిగా మారారని లేఖలో పేర్కొన్నారు.
ఇలా పురంధేశ్వరి, విజయసాయి మధ్య గత నాలుగు రోజులుగా జరుగుతున్న విమర్శలు రాజకీయ వేడిని తలపిస్తున్నాయి. ఏపీలో విపక్ష నేతలను కేసుల్లో ఇరుకించడం.., ప్రశ్నిస్తున్న మహిళా నేతలను నీచ పదజాలంతో కించపర్చడం వైసీపీకీ.., ఆ ప్రభుత్వం మంత్రలకు పరిపాటిగా మారింది. ఇది సాంప్రదాయ రాజకీయాలకు గొడ్డలిపెట్టులాంటదని విశ్లేషణలు నాటివి కావు.











