ఒంగోలు ఘటనతో వైశ్య సంఘాలలో కదికలు..!
ఒంగోలు వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తా పై జరిగి దాడి ఘటన అధికార వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైశ్య సామాజిక వర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం వైశ్య కమ్యూనిటి అనే భావనతోనే గుప్తాపై బాలినేని అనుచరుడు సుభాని దాడికి పాల్పడ్డారని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు విమర్శించారు. వల్లభనేని వంశీ కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హితవు పలికిన నేరానికి గుప్తా దాడి చేయడం హేమనీయమని ఖండించారు. ఇది యావత్తు వైశ్య సామాజిక వర్గాన్ని కలతకు గురిచేసిందని వివరించారు. సుభాని మంత్రి బాలినేనిపై ఉన్న స్వామి భక్తితో చేశాడా? లేకుంటే తాను నాయకుడిగా ఎదుగడానికి గుప్తాపై దాడికి పాల్పడ్డాడని అనుమానం వ్యక్తం చేశారు.
త్వరలో నిర్ణయం ప్రకటిస్తా ..!
వైసీపీ పరువును కాపాడుకొని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మంచిపేరు తీసుకురావాలనే గుప్తా హితవు పలికాడే తప్పా .. ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని ఎమ్మెల్యే రాంబాబు సమర్థించారు. దాడి చేస్తే సరిపోదని, ఆ తరువాత న్యాయస్థానం, చట్టాల ముందు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. త్వరలో గిద్దలూరు రాజకీయ పరిస్థితులపై సీఎం జగన్ ను కలిసి వివరించడంతోపాటు, సుబ్బారావు గుప్తా పై జరిగిన దాడిని కూడా వివరిస్తానని రాంబాబు చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ ను కలిసొచ్చిన తరువాత సంచలన వార్త ఒకటి మీరు వింటారని మీడియాకు రాంబాబు లీకులిస్తున్నాడు. ఈ లీకులే ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. అధికారపార్టీలో మారుతున్న రాజకీయ కారణాలా? లేక వైశ్యుల పట్ల వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరా? అన్నది ఎమ్మెల్యే రాంబాబు స్పష్టం చేయనప్పటికీ.. రాజీనామా చేస్తారని ఊహగానాలైతే ఊపందుకున్నాయనే చెప్పవచ్చు! మరోవైపు వైశ్య సంఘాల నుంచి కూడా రాంబాబుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం!!