వరదల్లో గగ్గొలు పెడుతుంటే .. మీకు విందులు కావాలా ?
ప్రజలు ఓటు బ్యాంకు మాత్రమే … నిజమేగా … అన్నది జగన్ రెడ్డి పాలనలో తేటతెల్లమైంది. కేవలం డబ్బులిస్తే చాలు .. వారు ఎలాంటి వాళ్లు .. వారికేమైనా నేర చరిత్ర ఉందా? సామాజీక సృహ కొద్దిగొప్పైనా ఉందా ? అని చూడరు! వారి మానసిక పరిస్థిని కూడా గమనించరు? డబ్బిస్తే చాలు .. ఓట్లు గుద్ది .. గెలిపిస్తారు… కష్టాలొస్తే దేవుడా అంటూ మొత్తుకుంటారు. అలా చేసిన దానికే .. అన్ని వ్యవస్థలతో పాటు ప్రజాస్వామ్యం కూడా క్షోభింస్తుంది! ‘మని మేక్ విక్టరీ’ తో సాగుతున్న పొలిటికల్ సినారియో మారాలి. ఓటరు మారితేనే సామాజం బాగుపడుతోంది. సీమ ప్రజలపై ఎక్కడో కనిపించని దేవుడు చిన్న చూపు చూశాడు …. కంటికి కనింపిచే ముఖ్యమంత్రి కనికరించడం లేదు. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు వరదల్లో చిగుటాకులా వణుకుతోంది. వరద బీభీత్సానికి ప్రాణాలను అరచేతులో పట్టుకుని కాలం గడుపుతున్నారు. వేల ఇళ్లు…. లక్షల ఎకరాల్లో పంటలు …. వేల కోట్లలో ఆస్తులు .. పదుల సంఖ్యలో ప్రాణాలు … అన్ని వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అలాంటి అభాగ్యులకు బాసటగా నిలవాల్సిన ముఖ్యమంత్రి జగన్ .. ఎక్కడో ఆకాశంలో పక్షిమాదిరిగా ఎగిరి … కాలు కిందపెట్టకుండా పైనుంచి పైనే చూసి వెళ్తాడు… ఆదుకోవాలని అధికారులను ఆదేశిస్తాడు. చేత్తో అందిస్తే అది సాయం అవుతోంది… విసిరేస్తే భిక్ష అవుతోంది అన్న కనీస ఇంగితం లేని ముఖ్యమంత్రి దొరకడం మా దౌర్భగ్యమని సీమ ప్రజలు తలగొట్టుకుంటూ.. కన్నీరు పెడుతున్నారు. పొరగు రాష్ట్రం తమిళనాడులో వరదలొస్తే ..ముఖ్యమంత్రి స్టాలీన్ ప్రజలతోనే గడిపాడు. అఖండ మెజారిటీతో బీజేపీని ఒంటిచేత్తో మట్టికరిపించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమత .. వరదలొస్తే భోజనం కూడా పునరాస కేంద్రాల్లోనే చేసి మరి వారితోనే గడిపారు. మరి……. మన సీఎం?
జగన్ మానసిక పరిస్థితిపై అనుమానాలు!
జగన్ మానసిక పరిస్థితులపై రాష్ట్ర ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ అనుమానాలు బలపడడానికి కూడా అనేక కారణాలు లేకపోలేదు. వేడుకలు, వినోదాలు, విందుల్లో తప్పా .. ఈ రెండునరేళ్లల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల్లో కనిపించింది చాలా తక్కువ. సంక్షేమ పథకాల అమలు, ప్రారంభోత్సవాలు మినహాయించి.. మరేక్కడ కనిపించరు ఈ ముఖ్యమంత్రి. వరద కష్టాల్లో విలవిలలాడుతున్న నేపథ్యంలోనైనా కనిపిస్తాండంటే అక్కడ కూడా కన్పించరు. పెళ్లిళ్లు, పేరాంటాలకు మాత్రం తప్పనిసరిగా హాజరు వేయించుకునే జనగ్ రెడ్డి .. రాష్ట్రంలో వరదలు చేసిన గాయాలు .. వేల కోట్ల విధ్వంసం పట్టదా అని ప్రజలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ‘ఇసుక దొంగలు ..ఇసుక దొంగలు బాబాయ్’ అని సొంత ఎమ్మెల్యేలే రెండేళ్లుగా మొత్తుకుంటుంటే .. ఇప్పుడు తేరుకుని పేపర్లో ప్రకటనలు ఇస్తారే తప్పా .. ఒక్కసారి వరద జిల్లాలో జరిగిన నష్టం, అందించాల్సి సాయం, ప్రజా ప్రతినిధులకు దిశనిర్దేశం, వరదప్రాంతాల్లో లీడర్స్ టూర్ వంటివాటిపై ఆదేశాలిస్తారని ఈ నాలుగురోజులు నుంచి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే దశాబ్ధాల కాలంగా గుండెల్లో పెట్టుకుని ఆదుకుని, అక్కున చేర్చుకుని కుటుంబాన్ని చట్ట సభలకు పంపుతున్న కడపజిల్లా వరదల్లో నేడు తల్లడిల్లుతుంటే .. వారివద్దకు వెళ్లి ఓదార్చిన పాపాన పోలేదు. దివంగత నేత దూరమైనప్పుడు ఓదార్పుల్లో బిజీ … అధికారం కోసం పాదయాత్రలో బిజీబిజీ … అనుకున్న లక్ష్యం నెరవేరిన తరువాత తాడేపల్లి ప్యాలేస్ లో పబ్జితో సో బిజి అన్నట్లు జగన్ రెడ్డి మాససిక పరిస్థితి ఉంది అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి మానసిక పరిస్థితి వింతగా ఉందని, ఆ సమస్యతో ఏమైనా బాధపడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలను ఓట్ల యంత్రాలుగా భావించి, అందులో ఎన్నికల సమయంలో డబ్బులేసి.. ఆ తరువాత అధికారమనే కార్డుతో లాగేయొచ్చు అన్న సంస్కృతి మానుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. ఇప్పటికైనా కళ్లు తెరచి వరద బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.











