వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్గోపాల్ వర్మ మరోసారి టీడీపీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు. నారా చంద్రాబాబు నాయుడి పుట్టిన రోజు తరువాత రామ్గోపాల్ వర్మ ఈ ట్వీట్ చేయడంపై పలుకోణాల్లో చర్చ నడుస్తోంది. నాకు నచ్చినట్టు ఉంటాను.నచ్చినట్టు మాట్లాడతాను అని చెప్పే వర్మ…గతంలోనూ టీడీపీని, పవన్ కల్యాణ్ను టార్గెట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక తాజాగా రామ్గోపాల్ వర్మ చేసిన ట్వీట్ విషయానికి వస్తే..‘తెలుగు దేశం పార్టీ నారా లోకేష్ అనే సూక్ష్మ వైరస్తో ప్రాణాంతక పరిస్థితుల్లో ఉంది. దీనికి తారక్ (జూనియర్ ఎన్టీఆర్) మాత్రమే ఔషధం. టీడీపీ శ్రేణులు ఈ టీకాను పార్టీకి ఎంత త్వరగా వేస్తే అంత మంచిది.’ అని ట్వీట్ చేశారు. వరుసగా రెండు ట్వీట్లు ఇదే కోణంలో చేసిన వర్మ.. తరువాత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. ఓవైపు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూనే..టీడీపీ విషయంలో ట్వీట్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.
కాగా ఈ ట్వీట్ విషయంలో వైసీపీ, యాంటీ టీడీపీ గ్రూప్స్ షేర్ చేస్తుండగా టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏపీలో ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నావ్ అని కొందరు, టీడీపీని టార్గెట్ చేసే బదులు నీ సలహాలేవో జగన్కు ఇవ్వచ్చు కదా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
టీడీపీని టార్గెట్గా చేసుకుని..
ఇక రామ్గోపాల్ వర్మ గత కొన్నేళ్లుగా టీడీపీని టార్గెట్గా చేయడంతో పాటు వైసీపీని, వైసీపీ విధానాలను వ్యతిరేకించే వారిని కూడా టార్గెట్ చేసి ట్వీట్లు చేయడం గతంలోనూ జరిగింది. సరిగ్గా ఎన్నికల సమయంలో అమ్మరాజ్యంలో కడప రెడ్లు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలను రిలీజ్ చేసిన ఆర్జీవీ.. ఉద్దేశ పూర్వకంగానే టీడీపీని డామేజ్ చేయడానికి ప్రయత్నించారన్న విమర్శలూ వచ్చాయి. అదే సమయంలో వైసీపీ కూడా గతంలో పరోక్షంగా ఆర్జీవీని సపోర్టు చేయడాన్ని కూడా టీడీపీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసిన నేపథ్యంలో గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నించిన ఆర్జీవీ.. జగన్పై కోడికత్తి దాడి ఘటనను కూడా ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రతి అంశంలో వీలైనంత వరకు జగన్ ను, వైసీపీని వెనుకొచ్చే ప్రకటనలు ఆర్జీవీ చేస్తారని, పవన్ కల్యాణ్ను కూడా అందుకే ఆర్జీవీ టార్గెట్ చేశారని కామెంట్లూ వినిపిస్తున్నాయి.
Also Read ;- బాబుకు శుభాకాంక్షల వెల్లువ : చంద్రబాబును విష్ చేసిన సీఎం జగన్
There’s something wrong in the art direction of this setting ..Hey @ssrajamouli sir can u please ask ur art director @sabucyril to tell . Please please please 🙏 pic.twitter.com/nWeieb6cad
— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021
విచక్షణ కూడా మరిచి..
గతంలో పలు ఇంటర్వ్యూల్లో తనకు ఏదనిపిస్తే అదే చేస్తానని, సమాజంతో తనకు పనిలేదనే అర్థంలో మాట్లాడిన ఆర్జీవీ అందుకు తగినట్టుగానే కొన్నిసార్లు విచక్షణ మర్చిపోయి కామెంట్లు చేస్తారని పవన్ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ కొవిడ్ కారణంగా చికిత్స పొందుతున్న ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే దీనిపై స్పందించిన ఆర్జీవీ..ఈ ఫొటోలో ఆర్ట్లో తప్పు ఉందని కామెంట్ చేశాడు. కొవిడ్ చికిత్స పొందుతున్న వ్యక్తిపై కనీస విచక్షణ మర్చిపోయి.. ఈ కామెంట్ ఏంటనే ప్రశ్నకూడా తలెత్తింది. మరో ట్వీట్ లో పవన్ కళ్యాణ్కు కరోనా సోకింది. ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ.. హే పీకే ఫ్యాన్స్.. కరోనా వైరస్ను పచ్చడి చేసి చంపేయండి అని ట్వీట్ చేశాడు.
ఎంపీ రఘురామకృష్ణంరాజుని ఉద్దేశించి కూడా..
వైసీపీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుని ఉద్దేశించి కూడా ఆర్జీవీ ట్వీట్ చేశాడు. సినిమా ప్రేమికుడు రాజమౌళి తన RRRతో ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ జగన్ ప్రేమికుడు ఆర్ఆర్ఆర్ (రఘురామ కృష్ణంరాజు) వైసీపీని కాపాడేందుకు వచ్చాడు. జగన్పై స్వచ్ఛమైన ప్రేమను కనబరుస్తున్నారని చెప్పడం నాకు సంతోషాన్ని ఇస్తుంది’ అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్లపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. వైసీపీని వ్యతిరేకించే వారిని ఆర్జీవీ టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఆ చర్చల సారాంశం. ఇక్కడే మరో కామెంట్ కూడా వస్తోంది. జగన్ని ఓ గొప్ప వ్యక్తిగా చూపించేందుకు తీస్తున్న సినిమాకు కడప జిల్లాలోని ఓ మున్సిపల్ ఛైర్మన్ కుమారుడు ప్రొడ్యూసర్గా ఉన్నారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.
Must Read ;- నడిచే లైబ్రరి,పోరాటమే ఊపిరి.. విజన్ ఉన్న నేత చంద్రబాబు











