అక్రమ ఆస్తుల కేసులో 11 ఛార్జిషీట్లు ఎదుర్కొంటూ, సీబీఐ కోర్టులో ఏ వన్గా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు సంవత్సరాలుగా వాయిదాలకు కూడా హాజరుకావడం లేదని, ఈ కేసును త్వరగా తేల్చాలని రఘురామరాజు పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా, తమ పార్టీని కాపాడుకోవాల్సికోవాల్సిన బాధ్యత తనపైన కూడా ఉంది కాబట్టి, తమ నేత జగన్ పై నీలాప నిందులు వేస్తున్నారు కనుక కేసును వెంటనే తేల్చాలని పిటిషన్లో కోరినట్టు ఎంపీ మీడియాకు వెల్లడించారు.
మా నేత సచ్ఛీలుడు..
జగన్పై సీబీఐ నమోదు చేసిన కేసుల ట్రయల్స్ ఆలస్యంగా జరుగుతున్నాయని ఎంపీ రఘురామరాజు ఢిల్లీలో అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు తమ నేతపై నీలాపనిందలు వేస్తున్నారని, అందుకే త్వరగా కేసుల నుంచి బయటపడి సచ్ఛీలుడిగా బయపడాలని కోరుకుంటున్నానని ఎంపీ స్పష్టం చేశారు. రెండేళ్లుగా జగన్ కోర్టు వాయిదాలకు కూడా వెళ్లకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని, లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత మాదిరి సీఎంగా జగన్ నమ్మిన వారికి ఛాన్స్ ఇచ్చి కేసుల నుంచి బయటపడాలని ఎంపీ రఘురామరాజు సూచించారు.
Must Read ;- అక్రమ కేసులపై ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్రపతికి ఫిర్యాదు