దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాజకీయనాయకులు ఒక్కొక్కరుగా కరోనాకు బలవుతున్నారు. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్(82) కన్నుమూశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ప్రముఖనాయకుడైన అజిత్ సింగ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఏప్రిల్ 20న కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని చరణ్సింగ్ కుమారుడైన అజిత్సింగ్ ఉత్తర ప్రదేశ్లో రాజకీయంగా కీలకమైన నేతగా ఎదిగారు.
ప్రజల కోసం పరితపించిన నాయకుడు : చంద్రబాబు
కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యునిగా, కేంద్రమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారని, ప్రజల కోసం పరితపించిన నాయకుడని చంద్రబాబు కొనియాడారు. అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపాటు తెలుగు రాష్ర్టాల నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని కేసీఆర్ అన్నారు.
Deeply saddened to learn about the passing away of my friend and Rashtriya Lok Dal supremo, Sri Chaudhary Ajit Singh Ji. A true farmer leader, he fought battles for farmers' welfare from the streets to the Parliament. Our heartfelt condolences to @jayantrld and Chaudhary family pic.twitter.com/ZvsON0NfRG
— N Chandrababu Naidu (@ncbn) May 6, 2021











