విశాఖలో ఎంపి భార్య, కొడుకు కిడ్నాప్, గంజాయి మత్తులో కట్టేసి కొట్టడం, చిత్రహింసలు పెట్టడం కిరాతకం. అక్కను వేధించవద్దన్న తమ్ముడినే సజీవ దహనం చేయడం సైకోచర్యలకు పరాకాష్ట.. ఏపిలో గంజాయి మాఫియా ఎంత బరితెగించిందో ఈ 2రోజుల్లో ఘటనలే సాక్ష్యం..అటు సైకోల స్వైర విహారం, ఇటు గంజాయి మాఫియా అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ అల్లాడుతోంది. బైటకెళ్లిన ఆడబిడ్డ, ట్యూషన్ కెళ్లిన తమ్ముడు, మార్కెట్ కెళ్లిన మహిళ, ఉద్యోగానికెళ్లిన వ్యక్తి ఇంటికి క్షేమంగా తిరిగొస్తారన్న నమ్మకం లేదు..కానీ డిజిపి మాత్రం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యే లేదంటారు, రౌడీషీటర్ల కదలికలే లేవంటారు.. నేరగాడే పాలకుడైతే రాష్ట్రంలో నేరగాళ్లెంత రెచ్చిపోతారో, సైకోలెంత స్వైర విహారం చేస్తారో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులే నిదర్శనం.
విశాఖ ఎంపీ భార్యను, కొడుకును ఎంపి ఇంట్లోనే కట్టేసి కొడతారా..? గంజాయి మత్తులోనే తన కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టారని వైసిపి ఎంపి చెప్పడాన్ని ఎలా చూడాలి..? స్టేషన్ లో సంతకం పెట్టడానికి రౌడీ షీటర్ 3రోజులు రాడని ఎంపి కొడుకే చెప్పడమా..? అధికార పార్టీలో ఒక విభాగంగా పోలీసు శాఖ మారిందనడానికి గత 4ఏళ్ల ఘటనలే అద్దం పట్టాయి. వైసిపి అండ, పోలీసుల మద్దతుతోనే అరాచకశక్తులింతగా బరితెగించాయి. బాపట్ల జిల్లా రాజోలులో 10వ తరగతి విద్యార్ధిని సజీవ దహనం చేయడం కన్నా కిరాతకం మరొకటిలేదు. మేమెన్ని నేరాలు-ఘోరాలకు పాల్పడ్డా బెయిల్ పై వస్తాం, మా వెనకుందెవరో తెలుసా, బైటకొచ్చాక మళ్లీ మీ పని పడతామన్న బెదిరింపులే నేరగాళ్ల బరితెగింపునకు నిదర్శనం. 4ఏళ్ల జగన్మోహన రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్ గా మార్చారు. క్రిమినల్స్ హెవెన్ గా రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారు.
గంజాయి మత్తులో తాడేపల్లిలో సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే మహిళపై గ్యాంగ్ రేప్.. గంజాయి మత్తులోనే బాపట్ల జిల్లా రాజోలులో పదోతరగతి విద్యార్ధిపై పెట్రోలు పోసి తగలెట్టడం..వైసిపి ఎంపి భార్య, కొడుకును ఎంపి ఇంటిలోనే కట్టేసి కొట్టడం, హింసించడం గంజాయి మత్తులోనే..కృష్ణా ఇసుక తిన్నెలపై షికారుకెళ్లిన జంటలో యువకుడిని కట్టేసి, యువతిపై సామూహిక అత్యాచారం…గంజాయి మత్తులోనే చిన్నారిపై సైకో అఘాయిత్యం..ఏపిలో గంజాయి మాఫియా మూకల ఆగడాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు..నాలుగేళ్లలో రాష్ట్రాన్ని గంజాయాంధ్రప్రదేశ్ గా మార్చిన పాపం జగన్మోహన రెడ్డిదే..
గంజాయి మత్తులో రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, గ్యాంగ్ రేప్ లు, సజీవ దహనాలు..బాపట్ల జిల్లా రాజోలులో ముక్కుపచ్చలారని విద్యార్ధి సజీవ దహనం గంజాయి మత్తులో సైకోల అరాచకాలకు పరాకాష్ట.. ఎంపి ఇంట్లేనే ఎంపి భార్య, కొడుకును, ఆడిటర్ ను కట్టేసి కొట్టడం, హింసించడం సైకోల రాక్షసత్వం..దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ శాంతిభద్రతలింత దిగజారలేదు..గంజాయి కేపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపిని చేసిన పాపం జగన్ రెడ్డిదే.. జగన్మోహన రెడ్డి అండతోనే రాష్ట్రంలో గంజాయి మాఫియా బరితెగించింది.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమను గంజాయి డెన్ లుగా మార్చేశారు..
చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేశారు..జగన్మోహన రెడ్డి గంజాయాంధ్రప్రదేశ్ గా దిగజార్చారు..వైసిపి నాయకుల అండతోనే గంజాయి మాఫియా పేట్రేగిపోతోంది. హత్యలకు, అత్యాచారాలకు, గ్యాంగ్ రేప్ లకు, చివరికి సజీవ దహనాలకు కూడా తెగబడ్డారు. బాపట్ల జిల్లాలో పదోతరగతి విద్యార్ధిపై పెట్రోలు పోసి తగలబెట్టారు..సీఎం సొంత నియోజకవర్గంలోనే దళితుడిని కిరాతకంగా హత్యచేశారు. విశాఖలో ఎంపి భార్య, కొడుకును కట్టేసి కొట్టి చిత్రహింసలు పెట్టారు..రాష్ట్రంలో ఎక్కడ చూసినా అశాంతి, అభద్రతే..ఈ నేరాలు-ఘోరాలకు సీఎం జగన్మోహన రెడ్డిదే బాధ్యత..
15వేల ఎకరాల్లో గంజాయి పండిస్తుంటే కళ్లు మూసుకున్నదెవరు..? రూ 25వేల కోట్ల గంజాయి రవాణా చేస్తుంటే చోద్యం చూస్తోందెవరు..? గంజాయి మత్తులో నేరాలు-ఘోరాలకు పాల్పడుతున్న సైకోలపై చర్యలేవి..? కఠిన చర్యలు తీసుకుంటే, రాజోలులో పదోతరగతి విద్యార్ధిని సజీవ దహనం జరిగేదా..? సమర్ధ పోలీసింగ్ ఉంటే విశాఖ ఎంపి భార్య, కొడుకు కిడ్నాప్ జరిగేదా, చిత్రహింసలకు గురయ్యేవారా..? అరాచకాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చిన నేరం జగన్మోహన రెడ్డిదే..గ్రామ గ్రామానా, వార్డువార్డునా ‘‘సైకో పోవాలి-సైకిల్ రావాలి’’ అంటోంది అందుకే..
జగన్మోహన రెడ్డి పాలనలో బడుగుల ప్రాణాలకు భద్రత కరువైంది…బీసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయి..బాపట్ల జిల్లా రాజోలులో పదో తరగతి చదివే విద్యార్ధిని సజీవ దహనం చేయడం తాజా దృష్టాంతం..ట్యూషన్ కు వెళ్లివచ్చే చిన్నారులకే రక్షణ లేకుండా పోయింది..కాలేజీకి వెళ్లొచ్చే ఆడబిడ్డల మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది.. ఎప్పుడెటువైపు నుంచి ఏ సైకో వచ్చి ఏం చేస్తారో అనే భయాందోళనల్లో ప్రజల్లో భయోత్పాతం నెలకొంది..క్రిమినల్ పాలకుడైతే క్రిమినల్స్ ఎంత రెచ్చిపోతారో, సైకోలెంత బరితెగిస్తారో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులే నిదర్శనం..ఇకనైనా ప్రజలు మేల్కోవాలి, రాబోయే ఎన్నికల్లో వైసిపిని చిత్తుగా ఓడించాలి, సైకోల భరతం పట్టాలి, రాష్ట్రాన్ని రక్షించాలి.