సౌతిండియా స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. టాలీవుడ్ లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో కమర్షియల్ సక్సస్ సాధించకపోయినా.. గుడ్ ఫర్ ఫార్మర్ అనిపించుకుంది. ఆతర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించినా.. సక్సస్ సాధించలేదు. అయితే.. గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫామ్ లోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్ లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న శృతిహాసన్ రీసెంట్ గా తెలుగులో క్రాక్ మూవీతో సక్సస్ సాధించింది.

తమిళ్ లో లాభమ్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన నటించింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా శృతిహాసన్ సోషల్ మీడియాలో చాట్ చేసింది. ఈ చాట్ లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఇందులో ఓ నెటిజన్ లవ్ లైఫ్ గురించి అడిగితే.. మళ్లీ లవ్ లో పడినట్టు చెప్పింది. అయితే.. ఎవరితో అనేది మాత్రం చెప్పలేదు.
గతంలో.. ఇటాలియన్ మ్యూజిక్ డైరెక్టర్ మైఖేల్ కోర్సలేతో ప్రేమలో పడింది. అతన్ని కమల్ హాసన్ కి పరిచయం చేయడం కూడా జరిగింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనుకుంటే.. ఏతర్వాత ఏమైందో ఏమో కానీ వీరిద్దరికీ బ్రేక్ అప్ అయ్యింది. అయితే.. ఓ నెటిజన్ఎ క్స్ బాయ్ ఫ్రెండ్ అంటే కోపమా అని అడిగితే.. నవ్వుతూ.. అలాంటిది ఏమీ లేదని చెప్పింది. అన్నింటికి బాగానే సమాధానం చెప్పింది కానీ.. ఇప్పుడు ఎవరితో లవ్ లో పడింది మాత్రం చెప్పలేదు.
Must Read ;- కొత్త బాయ్ ఫ్రెండ్ తో డ్రగ్స్ కేస్ బ్యూటీ











