దేశంలో ప్రతి రోజు ఏదో ఒక మూల ఆడవారి పై లైగింక దాడులు జరుగుతూనే ఉంటున్నాయి. ఆడవారి కోసం ఎన్ని చట్టాలను తీసుకుని వచ్చినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఎక్కడోక చోట దాడులకు గురువుతున్నారు. ఇలాంటి కేసులలో ఒకటి కర్నూలు సుగాలి ప్రీతి కేసు.
అసలేప్పుడు జరిగింది?
2017లో ఆమెపై అత్యాచారం చేసి చంపినట్లు తెలిసిందే. ఈ బాలిక కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో పదవ తరగతి చదివేది. ఈ నేపథ్యంలో 2017 ఆగస్టు 19న ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అయితే ప్రీతి చనిపోయిన తీరు మీద తల్లిదండ్రలు పాఠశాల యజమాని కొడుకులే బలవంతంగా తమ కుమార్తెను రేప్ చేసి చంపేశారని ఆరోపించారు.
ఇది ముమ్మాటికీ హత్యే..
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం చేసిన వైద్యులు ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ లో బాలికని రేప్ చేసినట్లు నిర్ధారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు తమ దగ్గరున్న ఆధారాలతో తాలూకా పోలీసు స్టేషన్ లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యజమానితో పాటు అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు.
అప్పుడు నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు ముందుగా త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ తరువాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. బాలిక శరీరంపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాల పట్ల కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. విద్యార్థినిపై లైగింక దాడి చేసి హత్య చేశారని నివేదిక ఇచ్చింది.
ఈ కేసులో సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ వారు కేవలం 23 రోజుల్లోనే బెయిల్ పై బయటకు వచ్చారు. దీంతో తమ బిడ్డను చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు.
పవన్ ను కలిసిన బాలిక తల్లిదండ్రులు..
దళిత సంఘాలు కూడా బాలిక తల్లిదండ్రులకు మద్దతు తెలిపారు. అయినప్పటికీ తమకు న్యాయం జరగలేదంటూ ప్రీతి తల్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటూ పవన్ కల్యాణ్ కర్నూలులో ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ తో కర్నూలు పోలీసులు కేసును సీబీఐకి అప్పగించారు.
ఢిల్లీ వెళ్లిన ప్రీతి తల్లిదండ్రులు..
తమ కూతురుపై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఢిల్లీలో ఎస్సీ కమిషనన్, కిషన్ రెడ్డి సహా సీబీఐ అధికారులతో పాటు నిర్భయ కేసు వాదించిన న్యాయవాది సీమా కుష్వాహను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇప్పటి వరకు సీబీఐ పట్టించుకోలేదు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు లో ర్యాలీ నిర్వహించిన తరువాత ప్రభుత్వం కేసును సీబీఐకి ఇస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల తరువాత కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు సీబీఐ దీని గురించి పట్టించుకోలేదంటూ తల్లిదండ్రులు వాపోయారు.
ఇకేందుకు ఆ చట్టాలు..? : ప్రీతి తల్లి
తమ బిడ్డ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు కేసులో ఎటువంటి పురోగతి లేదు. తరువాత రాష్ట్రంలో దిశ చట్టం అంటూ ఒక చట్టాన్ని రూపొందించారు. ఉపయోగం లేని ఆ చట్టాలు ఎందుకు పెట్టారు ముఖ్యమంత్రి గారు అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. పాఠశాల యజమాన్యానికి అధికారులు, రాజకీయ ప్రముఖుల అండదండలు ఉండబట్టే నిందితులు కేవలం కొద్ది రోజుల్లోనే బెయిల్ పై బయటకు వచ్చారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మాకు న్యాయం చేయండి మేడమ్
తమకు న్యాయం జరిగేలా చూడాలని నిర్భయ కేసు వాదించిన సీమా కుష్వాహను ప్రీతి తల్లి కోరారు. ఈ కేసులో కూడా నిందితులకు ఉరి శిక్ష పడే విధంగా చూడలంటూ ఆమె వేడుకున్నారు.
సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తా: సీమా
సుగాలి ప్రీతి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలో తనను కలిసినట్లు న్యాయవాది సీమా తెలిపారు. కేసు గురించి సుప్రీం కోర్టులో నవంబరు 2 తరువాత పిటిషన్ వేయనున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. నిందితుల వెనక రాజకీయంగా బలమైన వ్యక్తులు ఉండటంతోనే న్యాయం జరగటం లేదని తెలుస్తుంది. కేసును సీబీఐకి అప్పగించినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి కనిపించలేదు. న్యాయం కోసం పోరాడుతున్న ప్రీతి తల్లిదండ్రులను, బంధువులను కొందరు బడా నేతలు తమ మాటలతో బెదిరిస్తున్నారు. నిందితుల వెనుక అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సీమా అన్నారు. సీఆర్పీఎఫ్ తో ప్రీతి కుటుంబానికి భద్రత కల్పించాలని సుప్రీం కోర్టును కోరతానని ఆమె అన్నారు.