రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదంపై మంగళవారం అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇద్దరూ ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎవరికివారు తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం కట్టుబడి తమ తమ వాదనలను కేంద్రమంత్రికి వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు నీటి నిల్వ విస్తరణను అడ్డుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టును తమ రాష్ట్రానికి అప్పగించాలని కేసిఆర్ డిమాండ్ చేయగా మిగులు నీటినే వాడుకుంటున్నామని అంతకు మించి ఒక్క చుక్క నీరు కూడా వాడుకోవడం లేదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదరిస్తే అలంపూర్ దగ్గర ప్రాజెక్ట్ కట్టి తీరుతామని కేసిఆర్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అదే ఊపులో గోదావరి ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని కేసిఆర్ డిమాండ్ చేశారు.
చేసిన తప్పుకు దిద్దుబాటు చర్యలు
గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసిఆర్ అడగటం పెద్ద తప్పని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే గోదావరి మిగులు జలాలు ఎక్కువగా వాడుకుంటున్న తెలంగాణ ట్రిబ్యునల్ ఏర్పాటుతో నష్టపోనుందని వారు హెచ్చరిస్తున్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే సరిహద్దు రాష్ట్రాలన్నీ ఇన్వాల్వు కానున్నాయి. దీంతో ప్రాజెక్టుల అనుమతి రావడం కష్టమే. ఇప్పటివరకు గోదావరిపై తప్పా తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు పనులు చేయలేదు. మరి ఈ సమయంలో కేసిఆర్ నోట ట్రిబ్యునల్ మాట రావడం నష్టాన్ని తెచ్చిపెడుతోందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. దీంతో కేసిఆర్ వెనుకడుగు వేసి గోదావరి ట్రిబ్యునల్ అవసరం లేదని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
జగన్ కు దాస్?
జల వివాదాలకు సంబందించి కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు ముందుకు అధికారులు పూర్తి సమాచారంతో హజరవుతారు. ఒకవేళ ముఖ్యమంత్రులే కౌన్సిల్ సమావేశానికి హజరైతే ఏ చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా అధికారులు నివేదికలు సిద్ధం చేస్తారు. ఏపీ సీఎం జగన్ వెంట సీనియర్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో జలయజ్ఞం నుంచి మొదలు పెట్టి నీటి పంపకాలపై ఆయనకు పూర్తి కమాండ్ ఉంది. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనకు తెలంగాణ ప్రాజెక్టులపై కూడా పూర్తి అవగాహన ఉంది. దీంతో జగన్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు అపెక్స్ కౌన్సిల్ లో వాదనలను సిద్ధం చేయమని బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలను పూర్తి స్థాయిలో దాస్ నిర్వర్తించారు.
శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగులకు నీటిమట్టం పడిపోయినా తెలంగాణ రాష్ట్రం అనేక ప్రాజెక్టులు నిర్మించి నీటిని తోడుకుంటుందని అపెక్స్ కౌన్సిల్ లో ఏపీ ప్రభుత్వం లేవనెత్తడం వెనుక దాస్ మాస్టర్ బ్రెయిన్ ఉందని వార్తలు వినబడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులకు నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకువెళ్లడం సాధ్యపడుతుందని తెలంగాణలో వరుసగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ప్రాజెక్ట్ నీటిమట్టం 881 అడుగులకు చేరేదెప్పుడు? అంటూ దాస్ తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటానికి గురి చేసిందని వార్తలు వినబడుతున్నాయి.
కేసిఆర్ కు ఎవరు?
సుదీర్ఘ అనుభవం ఉన్న కేసిఆర్ కూడా కౌన్సిల్ సమావేశం అన్నీ నివేదికలతో సిద్దమయ్యాడు. నిపుణుడు విద్యాసాగర రావు మరణంతో తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రంతో బాటు ఏపీ రాష్ట్రానికి సంబందించిన ప్రాజెక్టులపై అవగాహనతో ఓ నివేదికను సిద్ధం చేసేవారని వార్తలు వినబడుతున్నాయి. కేవలం మన రాష్ట్రానికి సంబందించిన వాదనలను మాత్రమే వినిపించి ప్రక్క రాష్ట్రానికి సంబందించిన విషయానికి వచ్చేసరికి కేసిఆర్ గోదావరి ట్రిబ్యునల్ నుంచి ప్రస్తావించారు. దీని వల్ల భవిష్యత్తులో లీగల్ గా ముందుకువెళ్ళే అవకాశాన్ని కూడా కోల్పోతామని కేసిఆర్ లాంటి నాయకుడు మరిచిపోవడం ఏంటని విమర్శలు వినబడుతున్నాయి.
జగన్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట విన్నట్లే కేసిఆర్ కూడా అధికారుల సహయం తీసుకోని ఉంటే బాగుండేది కదా? అని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.











