తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటం.. హైకోర్టు కూడా మొట్టికాయలు వేస్తుండటంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రేపట్నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ మినహాయిస్తున్నట్లు, ఈ సమయంలోనే ప్రజలు నిత్యవసరాలు కొనుగోలు చేయాలని సూచించింది. లాక్ డౌన్ సమయంలో ఏయే వాటికి మినహాయింపులు ఇవ్వాలనే దానిపై చర్చ నడుస్తోంది.
మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది
— Telangana CMO (@TelanganaCMO) May 11, 2021











