స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా అడ్డంకులు వచ్చాయి. దీంతో షూటింగ్ బాగా ఆలస్యం అవుతోంది. అందుకే ఇక నుంచి ఎలాంటి బ్రేక్ లు లేకుండా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలనేది సుకుమార్ ప్లాన్. సమ్మర్ ఎండింగ్ కి ‘పుష్ప’ షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. తెలుగులో రూపొందుతోన్న ఈ సినిమాని తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బన్నీ సరసన నటిస్తున్న రష్మిక బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. సిద్దార్థ మల్హోత్ర.. ‘మిషన్ మజ్ను’ సినిమా ద్వారా రష్మిక బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.
రష్మిక బాలీవుడ్ ఎంట్రీ పుష్ప మూవీకి హెల్ప్ అవుతుందని చెప్పచ్చు. అలాగే ఇందులో మెయిన్ విలన్ ను బాలీవుడ్ నుంచే తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా పుష్పకు కలిసొచ్చే విషయమే. ఇలా.. పుష్ప మూవీ పై బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడేలా పక్కా ప్లాన్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మిస్తోంది. మరి.. బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఏ స్ధాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Must Read ;‘పుష్ప’ విలన్ రేసులో.. బాలీవుడ్ హీరో?











