ప్రకటించినంత ఈజీకాదు కట్టడం,తరలించడం!
మూడు రాజధానులను నిర్మిస్తున్నాను .. పరిపాలన, న్యాయ, శాసన రాజధానులను ఏర్పాటు చేస్తున్నాం .. వికేంద్రీకరణతోనే ప్రాంతాల అభివృద్ధి అని అసెంబ్లీ సాక్షిగా పలికిన పలుకులు ఇపుడేమయ్యాయి! చీకటి రోజుగా భావించే 2019, డిసెంబర్ 17 న జగన్ రెడ్డి చేసిన ప్రకటనతో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అక్షారాల రూ.40 వేల కోట్ల పనులు ఉన్నఫలంగా ఆగిపోయాయి. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్న ఏపీకి ఒక రాజధానికే దిక్కులేదు .. కానీ జగన్ రెడ్డి మూడు రాజధానులను నిర్మిస్తామని చాలా హట్టహాసం ప్రకటించారు. రెండేళ్లు కావస్తున్నా .. మూడు రాజధానుల అంశం ఒక ప్రహాసనంగా మారింది. పొరుగు రాష్ట్రాల నడుమ అపహస్యంగా మిగిలిపోయింది ఏపీ. 700 రోజులకు పైగా రైతులు దీక్షలు చేస్తుంటే .. దానిని పెయిడ్ దీక్షలు, నిరసనలు అని కామెంట్ చేస్తారు. రాజధాని అమరావతిని పరిరక్షించుకోవడానికి రైతులు తలపెట్టిన ‘న్యాయంస్థానం – దేవస్థానం’మహా పాదయాత్ర ఒక రాజకీయ పాదయాత్రగా మల్చే ప్రయత్నం చేసిన అధికారపార్టీ కుయుక్తులు పారలేదు. అంతేకాక రోజురోజుకు రైతు పాదయాత్ర అప్రతిహాతంగా సాగుతుంటే జగన్ రెడ్డికి కంటిమీద కునుకు పట్టడంలేదు. పాదయాత్ర ను ఎలా భగ్నం చేయాలని కుట్రతో పోలీసు చర్యలకు పాల్పడుతున్నారు. అది సాధ్యంకాక .. అధికారపార్టీ స్పాన్సర్ టీం ను రంగంలోకి దింపి మూడు రాజధానులకు మద్దతుగా పాదయాత్రకు తెరతీస్తున్నారు.
రాజధాన్లేని రాష్ట్రంలో మూడు రాజధానుల కోసం యాత్రా?
రాజధాని లేని రాష్ట్రంలో మూడు రాజధానులు కావాలని వైసీపీ స్పాన్సర్ టీం యాత్ర చేయడం సిగ్గుచేటని రైతులు, విన్నవారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఒకపక్క వేధిస్తూనే మరోపక్క రాజధాని గ్రామాల్లో మూడు రాజధానులు కావాలని దీక్షలు చేయిస్తూ .. గొడవులకు కుట్రలు పన్నారు. ఇదిలా ఉంటే మూడు రాజధానులు ముద్దు అంటూ ఈ నెల 22 నుంచి ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్రకు వైసీపీ శ్రేణులు పునుకుంటున్నాయి. ఒకపక్క భూములిచ్చి, భవిష్యత్తును సైతం తాకట్టుపెట్టి 700 రోజులు నుంచి పోరాడుతున్న రైతుల పట్ల కనీసం మర్యాద, జాలి చూపకుండా .. వారుచేస్తున్న ఆందోళనలను, పాదయాత్రను అవహేళన చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా పాదయాత్రకు పురికొల్పడం ప్రస్తుతం సరికాదని హితవు పలుకుతున్నా.. అధికారపార్టీ పాదయాత్రకు ఉవ్విలూరుతోంది. పాయకారావుపేట నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే గోళ్ల బాబారావు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా పాదయాత్రలో పాల్గొనాలని సదరు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మూడు రాజధానులపై సాగేదే రాజకీయం ..! మరి రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునివ్వడం ఏమిటి? అని పలు సందేహలు వ్యక్తమౌతున్నాయి.
మూడు రాజధానుల ముద్దు అంటే ముప్పు తప్పదు!
ఒక రాజధాని ముద్దు .. మూడు రాజధానులు వద్దూ .. అన్నది రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు, వామపక్షాల డిమాండ్. నిన్నకాక మొన్న అదే అంశపై బీజేపీ బాస్ .. అమిత్ షా కూడా ఏపీ కాషాయ శ్రేణులకు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారుగా ..! ఇక సోము కూడా పూర్తి మద్దతు అంటూ గంటా పదంగా పలికాడుగా!! మరి మీరు స్పాన్సర్ చేసి నడిపించే ‘మూ… రా .. ముద్దు పాదయాత్రకు రాష్ట్రంలో మీ బులుగు పార్టీ తప్పా .. ఏ పార్టీ మద్దతిస్తుందో చూడాలి. రైతులు చేస్తున్న ఉద్యమంలో న్యాయం, ధర్మం, నీతి, త్యాగం, కార్యదీక్ష అంటూ ఉన్నాయి. మరి ఫ్యాన్ పార్టీ నేతృత్వంలో సాగే మూడు రాజధానులకు మద్దతుగా సాగే పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు, ఏఏ ప్రజా సంఘాలు ముందుకు వస్తాయే చూడాలి. ఇప్పటికే జగన్ రెడ్డి మూడు రాజధానులను ప్రకటించి రాష్ట్రంలో చరిత్రహీనులుగా మారారు .. అధికారపార్టీ చేయాలనుకుంటున్నా .. ఈ పాదయాత్రతో ఉన్న కాస్తా పరువు పోగొట్టుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం సూచిస్తున్నారు.











