ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వకీల్ సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమాగా ‘వకీల్ సాబ్’ రాబోతుంది. ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ‘వకీల్ సాబ్’ సినిమా 2020 ‘మే’ నెలలోనే రిలీజ్ అవ్వాలి. కానీ కోవిడ్ – 19 కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
ఇటీవలే అన్ లాక్ లో భాగంగా ప్రభుత్వం సినిమా షూటింగ్లకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఈ సినిమా కూడా తిరిగి పట్టాలెక్కింది. ప్రస్తుతం అంజలి, నివేదా థామస్, అనన్య మీద కీలక సన్నివేశాలను తీస్తున్నారు. నవంబర్ మొదటి వారంలో మొదలయ్యే షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారని చిత్ర యూనిట్ తెలిపింది. నవంబర్ నుండి బ్రేకులు లేకుండా సినిమా కంప్లీట్ అయ్యేవరకు నాన్ స్టాప్ గా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసారని టాక్. ఈ నేపథ్యంలో సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.
డిసెంబర్ నెల చివరిలోగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అన్నీ కుదిరితే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు నిర్మాతలు. పవన్ రీ ఎంట్రీ సినిమా కాబట్టి మరో ఆలోచన లేకుండా ఫాన్స్ కి మంచి కిక్కెకించేలా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోను మరల వెండి తెరపై చూస్తామా అని వారు ఎదురు చూస్తున్నారు. అసలే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. తన దృష్టంతా రాజకీయాలపైనే పెట్టారు. ఇక ‘వకీలు సాబ్’ సినిమా పవన్ ఫాన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.