వచ్చారు.. అనుకున్నది సాధించారు..!
‘‘డేట్ ప్రకటించారు.. సమయం ఫిక్స్ చేశారు.. అనుకున్న సమయానికి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిదని ప్రతిజ్ఞ చేశారు.. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు! ఫైనల్ గా ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పీఆర్సీ సాధన సమితి సభ్యులు!’’ అనుకున్నలెక్కకు మించి లక్షకు మించి విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. నిఘా నీడలో, అడుగడుగునా పోలీసుల అంక్షలు నడుమ బెజవాడలో ఉద్యోగుల తలపెట్టిన కార్యక్రమం విజయవంతం చేయడంలో చాణిక్య వ్యూహాని అమలు చేశారు. రెండు రోజులుగా పోలీసు చర్యలు, అధికారులు బెదిరింపులను లెక్క చేయకుండా ఉద్యోగ సమస్యల సాధన కోసం చేస్తున్న ఉద్యమ తెగువ స్పూర్తివంతంగా ముగింసింది. ఏపీ నడిబొడ్డున ‘చలో విజయవాడ’ పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒక్కసారిగా పెట్టిన పొలికేక.. నిరాంకుశత్వ ప్రభుత్వ పునాదులకు బీటలు ఏర్పడే పరిస్థితి వచ్చిందని ట్రోల్స్ మిన్నంటుతున్నాయి. విజయవాడ రహదారులన్నీ ఉద్యోగుల జెండాలు, నినాదాలతో దద్దరిల్లాయి. భారీ ర్యాలీ ఉవ్వెత్తున ఎగిసిపడే కేరటంలా ఉద్యోగ సమూహాలు బీఆర్టీఎస్ రోడ్డువైపు కదిలాయి. వేలాదిగా ఉద్యోగులు వివిధ కూడళ్లు నుంచి ఒక్కసారిగా బయటకు రావడంతో పోలీసులు నివ్వెరబోయారు. ర్యాలీని కంట్రోల్ చెయ్యాలనే చర్యలు ఫలించవని.. చివరికి చేతులెత్తాశారు. బీఆర్టీఎస్ మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద నుంచి పీఆర్సీ సాధన సమితి ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీకి పీఆర్సీ సమితి ముఖ్య నేతలు సారథ్యం వహించారు.
నాలుగు జిల్లాలో నిండుతున్న జైళ్లు ..
‘చలో విజయవాడ’ కార్యక్రమంలో ఉద్యోగుల విశ్వరూపం దాల్చారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో బెజవాడ పురవీధులు, ప్రధాన రహదాలరులు హోరెత్తాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికెట్లను ఎక్కడికక్కడ ఛేదించుకుంటూ ఉద్యోగులు లక్ష్యంవైపు దూసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉద్యోగులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలిస్తున్నారు. గవర్నర్ పేట స్టేషన్ ఉద్యోగుల అరెస్ట్ లతో నిండిపోయింది. సుమారు 200 మంది ఉద్యోగులను అరెస్ట్ చేసి, స్టేషన్ కు తలించడంతో ఒక్కసారిగా గవర్నపేట పోలీస్ స్టేషన్ పరిశర ప్రాంతం నిరసనలతో ప్రతిధ్వనించింది. మరోవైపు గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కృష్ణా జిల్లాలోని పోలీసు స్టేషన్లు వేలాది మంది ఉద్యోగులతో ఇప్పటికే నిండిపోయాయి. ఎన్ని ఆంక్షాలు విధించి, నిర్బంధం చేయాలని చూసినప్పటికీ .. విజయవాడ నగర రహదారులు ఇసుకెస్తే రాలనంత మంది ఉద్యోగులు తరలివచ్చి వారి డిమాండ్స్ ప్రభుత్వానికి వినిపించారు. ఉద్యోగులు ఐక్యతను చాటారు. చీలికలు తీసుకొచ్చి ఐక్యతను చెడకొట్టాలని చూసే అధికార పార్టీ నేతలకు ’చలో విజయవాడ‘ కార్యక్రమం సక్సెస్ ఒక చెంపపెట్టులాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Must Read:-పోలీసులు వర్సెస్ ఉద్యోగులు! నేడు ఉద్యోగుల ‘చలో విజయవాడ’! ఏపీలో హై టైన్షన్ !!