మనుషులకే కాదు జంతువులకు కూడా స్వార్థం ఉంటుంది? స్వార్థం కోసం మనుషులతో గొడవపడి తమ పంతాన్ని నెగ్గించుకొంటున్నాయి. జంతువులకు మనుష్యులకు మద్య గొడవ ఏంటీ అని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే,జంతువులు మనుష్యులతో గొడవపడతాయి. ఓ పిల్ల ఏనుగు తనకు చెందిన మ్యాట్ లో మావటి పడుకోవడాన్ని జీర్ణించుకోలేక ఆయన తో గొడవపడింది.
చిన్న పిల్లలు తమకు కావల్సిన వాటి కోసం గారాభం చేస్తారు, అలిగి బుంగమూతి పెట్టుకోవడం సాధారణం. కానీ ఓ ఏనుగు పిల్ల మాత్రం తనకు మ్యాట్ కావాలని మావటి తో కుస్తీపట్టి సాధించుకుంది. భారత అటవిశాఖ కు చెందిన అధికారి డాక్టర్ సమ్రాట్ గౌద అందుకు సంబందించిన వీడియోను సామాజిక మాద్యమం లో పోస్టు చేశారు. అందులో ఏనుగు మావటి మ్యాట్ పై నిద్ర పోయేందుకు సిద్దం కాగా .. పిల్ల ఏనుగు చూసి ఆ మావటిని మ్యాట్ పై నుండి తొలగించి తాను నిద్రించేందుకు ప్రయత్నం చేసింది.అందులో భాగంగా మావటి తోకాసేపు పోట్లాడింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాద్యం లో వైరల్ గా మారింది.
నిజానికి ఆస్థుల కోసం డబ్బు కోసం ఇరువురి వ్యక్తుల మద్య గొడవలు జరిగాయి,జరుగుతున్నాయి. కానీ ఓయువడికి, ఓ పిల్ల ఏనుగుకి మద్య గొడవ ఏంటీ అంటే కేవలం మ్యాట్ కోసమేని ఈ వీడియో చూస్తేగానీ తెలియదు..ఇది నాది, నా సొంతం అన్న మాట మనసులో రాగానే మనిషిలో స్వార్థం తెలియకుండానే జనిస్తుంది.ఆ స్వార్థం కోసం మాట్లాడి పోట్లాడి సాధించుకునేందుకు ముందుకు సాగుతాడు.జంతులకు కూడా స్వార్థం ఉంటుందని ఈ వీడియో స్పష్టం గా తెలియజేసింది. ఏనుగు పిల్ల కూడా ఆ మ్యాట్ కోసం మావటి తో గొడవపడి సాధించుకొని సుఖంగా నిద్రపోయింది.. ఆ ఏనుగు పిల్ల నిద్ర పోయాక ఆ కీపర్ కూడా అక్కడే మ్యాట్ పై నిద్రకు పోయాడు.. అంటే స్వార్థం మనిషి లోనే కాదు జంతువుల్లో కూడా ఉందని తెలుస్తుంది.











