ఫలితాలు వెలువడడం మొదలయ్యాక వాస్తవానికి బోణీనే బాగోలేదు. అసలు ఇలాంటి ఫలితం రావటానికి కారణం ఏమిటన్నది ఆసక్తికర అంశం. దుబ్బాక ఉప ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పని చేసిన వారితో మాట్లాడినప్పుడు.. ఎన్నికల కోసం తిరిగి వారిని తరచి తరచి ప్రశ్నించినప్పుడు కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
బ్యాడ్ లక్ ఏమంటే.. ఇలాంటి విషయాలేవీ ప్రధాన మీడియాలో అస్సలు రాలేదు. ఎందుకంటే.. గ్రౌండ్ లెవల్లో తిరిగే వారు తక్కువైపోవటమే కారణం. ఇంతకీ ఇంత పోటాపోటీకి కారణం.. చాలా అంశాలు ఉన్నప్పటికి.. కరోనా కారణంగా పెద్ద ఎత్తున కంపెనీలు ఇచ్చిన వర్క్ ఫ్రం హోం కూడా కారణంగా చెబుతున్నారు.
హైదరాబాద్ లో పని చేసే అత్యధికులు వర్క్ ఫ్రం హోం కారణంగా ఇంట్లోనే ఉండి పని చేయటం.. స్థానిక పరిస్థితులతో పాటు.. బీజేపీ నేతలు ఒక క్రమపద్ధతిలో చేసిన ప్రచారం యూత్ ను తెగ ఆకర్షించిందట. దీనికి తోడు ఇంటి పట్టున ఉండటంతో.. వారు అదే పనిగా దుబ్బాక ఎన్నిక మీద ఎక్కువ ఫోకస్ చేయటమే కాదు.. ఇళ్లల్లోని పెద్దవాళ్లను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటు వేయించటంలో కీలకభూమిక పోషించినట్లు చెబుతున్నారు. దాని ఫలితమే.. ఇప్పుడు చూస్తున్నదంటున్నారు. వర్క్ ఫ్రం హోంతో ఇంటి పట్టున ఉన్న యూత్ గులాబీ కారు స్పీడ్ కు బ్రేకులు వేసిందన్న మాట టీఆర్ఎస్ వర్గాల నోటి నుంచి వినిపిస్తోంది.