ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా ప్రజా కార్యక్రమాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు. మరోవైపు, జగన్ మాత్రం తన ఎమ్మెల్యేలను, ఎంపీలను గందరగోళానికి గురి చేస్తూ.. వారి సీట్లను గల్లంతు చేస్తూ ఉన్న బలం పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే జగన్ పైన వైసీపీ నేతల్లో వందకు వందశాతం అసమ్మతి గూడుకట్టుకొని ఉంది. టికెట్ అవకాశం వచ్చిన వాళ్లు సైలెంట్ గా ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలు వారికి ఏ మాత్రం నచ్చడం లేదు. ఇంకొంత మంది మంత్రులు కూడా జగన్ పైన అసహనంతో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక టికెట్లు దక్కని వారి సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే కొంత మంది కీలక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ నేతలు టీడీపీ, జనసేనలోకి వెళ్లిపోయి వైసీపీ బలహీనపడుతున్నా.. జగన్ మాత్రం ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
ఇలా జగన్ గ్రాఫ్ పడిపోతుండగా.. అటు చంద్రబాబు హవా మాత్రం విపరీతంగా కొనసాగుతూ ఉంది. అది భరించలేని జగన్.. టీడీపీ కార్యక్రమాలను చెడగొట్టడానికి తన ప్రైవేటు సైన్యాన్ని పంపారు. జనాల్లోకి తప్పుడు సందేశం పంపేలా తప్పుడు పనులు చేయిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నిర్వహిస్తున్న రా.. కదలిరా.. సభలకు వేలాదిగా తరలివస్తున్న జనాల మధ్యలోకి తన ప్రైవేటు మనుషులను చొప్పిస్తున్నారు. వారితో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు పట్టించి.. నినాదాలు చేయిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు రా.. కదలిరా.. సభకు వైసీపీనే ఇలా ఎన్టీఆర్ బ్యానర్లతో మనుషుల్ని పంపింది. ఇక ఆ వీడియోలను అక్కడే ముందస్తు ప్లాన్ ప్రకారం సాక్షి మీడియా రికార్డు చేసి.. కోడై కూసింది. టీవీలో అదే పనిగా చూపించింది.
జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులను ఫ్యాన్స్ తీసుకువచ్చారని.. చంద్రబాబు వేదికపైకి వచ్చే ముందు ప్రదర్శించారని.. తప్పుడు వార్తలు ప్రసారం చేసింది. పైగా టీడీపీ నేతలకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గలబా జరిగిందని కూడా వార్తలు అల్లేసింది. వైసీపీ నేతలతో జెండాలను చింపి పడేయిస్తూ.. సాక్షి మీడియా నానా దారుణాలకు పాల్పడింది.
అసలు ప్రస్తుత రాజకీయాలకే సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ ను ఈ విషయాల్లోకి లాక్కొచ్చి అధికార వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు టీడీపీ నేతలకు మధ్య ఆర్టిఫిషియల్ వైరాన్ని క్రియేట్ చేసి.. దాంతో విపరీతంగా ఫేక్ ప్రచారానికి తెగబడ్డారు వైసీపీ నేతలు. తద్వారా తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపాలని జగన్ ఈ ప్లాన్ వేశారు. జరగబోయే రా.. కదలిరా.. సభలకు ఇప్పటికే ఈ ప్రైవేటు సైన్యం రెక్కీలు చేసినట్లుగా టాక్. ప్రతి సభలోనూ ఇదే తంతు జరుగుతుండడంతో ఇది వైసీపీ పనే అని ప్రజలు కూడా గ్రహించగలుగుతున్నారు.