వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి బొట్టు పెట్టుకున్నారు. పులివెందుల పర్యటనలో అరటి రైతుల పరామర్శ సందర్భంగా ఆయన పెద్ద స్పీచ్ ఇచ్చారు. ఏడాదిన్నర నుంచీ ప్రతిసారీ చెప్పే మాటలే మళ్లీ రిపీట్ చేశారు. కొత్తదనం ఏదైనా ఉందంటే అది బొట్టే. ఆయన ప్రసంగం కంటే.. నుదుటి మీద బొట్టే చాలా మంది దృష్టిని ఆకర్షించింది. జగన్ ఎప్పుడు తిరుమల వెళ్లినా.. వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వరు. పోనీ పబ్లిక్గా చెబుతారా అంటే ఆ పనీ చేయరు. ఆయన హిందూ దేవుళ్లని నమ్మరని.. ఆ మత ఆచారాలను పాటించరని అందరికీ తెలుసు. జగన్ హయాంలో టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించిన ఇద్దరూ వేరే మతం అనుసరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆయన లెక్కచేయరు.
ఇక వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్లు, సభ్యులు.. ఎన్ని అపచారాలు చేశారో.. ఎలాంటి ఘోరాలు చేశారో అందరికీ తెలుసు. స్వామి వారి ప్రసాదం, ఇతర కైంకర్యాల కోసం స్వచ్ఛమైన నెయ్యి వాడాలి. కానీ జే గ్యాంగ్ పాలనలో నెయ్యి పేరుతో భయంకరమైన రసాయనాలు ఉపయోగించారని సీబీఐ సిట్ తేల్చింది. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా వందల దేవాలయాల మీద దా*డుల జరిగాయి. అయినా ఆ దారుణాలపై ఒక్క మాటా జగన్ నోట వెంట రాలేదు. ఈ సంఘటనలన్నీ చూశాక హిందువుల మనోభావాలకు ఆయన ఏపాటి విలువ ఇస్తారో అర్ధం చేసుకోవచ్చు.
అలాంటి మనిషి.. ఈ మధ్య బొట్టుతో దర్శనం ఇస్తున్నారు. బొట్లు, నామాలు పెట్టుకోగానే.. హిందూ మతాచారాలపై సడెన్గా భక్తిభావం పుట్టుకొచ్చిందని.. ఆయన అభిమానులు కూడా నమ్మరు. వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలను.. చాలా విషయాల్లో.. చాలా సార్లు మోసం చేశారు. సిద్ధం, యుద్ధంలాంటి ఏ పేరుతో అయినా.. మళ్లీ మళ్లీ ట్రై చేసుకోవచ్చుగానీ.. జగన్ ట్రిక్స్ను నమ్మడానికి ఏపీ ప్రజలైతే సిద్ధంగా లేరు. అయితే జగన్ బొట్టుతో ఒక్క విషయం స్పష్టం అయింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో వైసీపీ మీద ప్రజలకు పీకల వరకు కోపం ఉందని.. వైఎస్ జగన్ కూడా గుర్తించారు. అందుకే బొట్టుతో మస్కా కొట్టే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. నెక్ట్స్ టైమ్ నిలువు నామాలు ట్రై చేస్తే మరింత మైలేజ్ వస్తుందేమో.. ఆయనా.. ఆయన టీమ్ ఆలోచించుకోవాలి











