తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో దాదాపుగా అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అఫిడవిట్ లో అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలు తెలుపాల్సి ఉంటుంది. అఫిడవిట్ లో అభ్యర్థులు సమర్పించిన ఆస్తుల వివరాలను పరిశీలిస్తే, వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి కారు కూడా లేదట. అభ్యర్థుల్లో అందరికంటే ఎక్కువ ఆస్తులు రత్నప్రభకే ఉన్నాయని తేలింది.
రత్నప్రభకే ఎక్కువ
బీజేపీ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కుటుంబం పేరు మీద రూ.24,68,52,141 విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. అయితే ఆమె పేరు మీద మాత్రం రూ. 19 కోట్లు, భర్త పేరు మీద 5 కోట్ల ఆస్తులున్నాయని తెలిపారు. తనపైకానీ, కుటంబంపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్ లో పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ మొత్తం ఆస్తుల విలువ రూ.7.77 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. రూ.5.70 కోట్లు విలువ చేసే వ్యసాయ భూములు, ఇతర ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆస్తులు మొత్తం రూ.47.25 లక్షలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. గురుమూర్తి పేరిట మాత్రం రూ.10,66,515 విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే భార్య పేరిట మాత్రమే 7 లక్షలు కారు ఉందని అఫిడవిట్ లో తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి చింత మోహన్ కుటుంబం పేరు మీద రూ.3.27 కోట్లు ఉన్నట్లు, తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్ లో పేర్కొన్నారు.
Must Read ;- పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపు.. తిరుపతి ఉపఎన్నిక కమిటీకి చంద్రబాబు హెచ్చరిక











