తిరుపతి పార్లమెంట్ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను ఖరారు చేసినప్పటికీ ఈ రోజు ఆమె నామినేషన్ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎవరూ పాల్గొనకపోవడం చర్చానీయాంశమయ్యింది. ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్టానం ఖరారు చేసిన తర్వాత హైదరాబాద్లో బీజేపీ, జనసేన నేతలు సమావేశమై తిరుపతిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కానీ రత్నప్రభ నామినేషన్ కార్యక్రమానికి మాత్రం జనసేన నేతలు హాజరు కాలేదు. దీంతో ఆమె బీజేపీ నేతలతో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. రత్నప్రభ గెలుపునకు పనిచేయాలని జనసేన శ్రేణులకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చినప్పటికీ తిరుపతిలో ఉండి కూడ ఆమె నామినేషన్ కార్యక్రమానికి హాజరుకాక పోవడం చర్చానీయాంశమయ్యింది.
జగన్కి ఢిల్లీ టెన్షన్..? కేజ్రీవాల్, కవిత అరెస్టులతో వైసీపీలో వణుకు..!!
ఏపీలో అన్ని స్థానాల్లో విజయం మనదే అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు ఏపీ సీఎం...