అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి రథం దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికీ రాజకీయ అగ్నిజ్వాలలు రేగుతూ ఉన్నాయి. రథం దగ్ధమవడం కుట్రా? ప్రమాదమా? అనే విషయంలోనే అనేకానేక సందేహాలు రేగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రమాద స్థలిని పరిశీలించడానికి వెళ్లిన మంత్రులకు మాత్రం ప్రజల నిరసనజ్వాలలు చవిచూడక తప్పలేదు.
అంతర్వేది పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రులను హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు నిలదీశారు. అంతర్వేది లో మంత్రుల పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతర్వేది దేవస్థానం వద్దకు భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఇతర హిందూ ధర్అంమ సంస్థల ప్రతినిధులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. అంతర్వేదిలో ఆందోళనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకొంది.
మంత్రులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాపాక డౌన్ డౌన్, అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రుల వాహనాల మీద రాళ్లు రువ్వారు. ఆందోళనలకు దిగిన జనాన్ని అదుపు చేయడానికి పోలీసులుచాలా కష్టపడాల్సి వచ్చింది.