క్రికెట్ లో సెంచరీ కొడతానని, కొట్టాలని బ్యాట్ పట్టుకొని క్రీజ్ లో అడుగుపెడతాడు ఏ బ్యాట్స్ మెన్ అయినా.. డకౌట్ అవ్వాలని ఎవరూ కోరుకోరు. అంబటి రాయుడు తీరు దీనికి పూర్తి రివర్స్లో కనిపిస్తోంది.. ఆయన తాను అభిమానించే పొలిటికల్ లీడర్ జగన్లా అంబటి రాయుడు కూడా రివర్స్ గేర్లో వెళుతున్నాడనే కామెంటరీలు వినిపిస్తున్నాయి..
క్రీజ్లోకి ఎంట్రీ ఇవ్వకముందే, బ్యాట్, ప్యాడ్ కూడా కట్టుకోకముందే అవుట్ అయితే దానిని ఏమనాలి.?? హిట్ వికెట్ ?? సేమ్ టు సేమ్.. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారనే చర్చ నడుస్తోంది.. ఆయన హిట్ వికెట్ కంటే ఘోరమయిన నిర్ణయం తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.. హిట్ వికెట్ అవ్వాలంటే కనీసం క్రీజ్ లో అడుగుపెట్టాలి.. కానీ, అంబటి రాయుడు బ్యాట్, ప్యాడ్ కట్టుకొని పిచ్లో ఎంట్రీ ఇవ్వకముందే అవుట్ అయ్యాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..
రీసెంట్ గా ఐపీఎల్ 16 విన్నింగ్ టీమ్ చెన్నై తరఫున క్రికెట్ ఆడిన అంబటి రాయుడు క్రికెట్కి ఫుల్ స్టాప్ పెట్టాడు.. ఇక పొలిటికల్ ఇన్నింగ్స్కి తెరదీస్తున్నాడు.. గత కొంతకాలంగా ఆయన రాజకీయ ట్వీటులు చేస్తున్నాడు.. వీటితో పొలిటికల్ ఎత్తుగడలు వేస్తున్నాడనే చర్చ మొదలయింది.. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ని, ఆయన సర్కార్ పనితీరుని ప్రశంసిస్తూ అంబటి రాయుడు ఇటీవల కొన్ని కామెంట్స్ పోస్ట్ చేశారు తన సోషల్ మీడియా అకౌంట్లో. వాటిపై చాలా పెద్ద చర్చ జరిగింది.. అప్పుడే అంబటి కొత్త ఇన్నింగ్స్కి తెరలేపుతున్నాడనే సంకేతాలు అందాయి.. ఆ మధ్య ఒకసారి ముఖ్యమంత్రి జగన్ని కలిసి వచ్చారు అంబటి రాయుడు.. తాజాగా మరోసారి జగన్ని కలిసి తన రాజకీయ తెరంగేట్రంపై పక్కా క్లారిటీ ఇచ్చారు..
జగన్ని కలిసిన అంబటి తనకు గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారట.. ఈ రెండు స్థానాలలో ఒకటి అయితే తాను గెలవడం ఈజీ అని చెప్పారట.. పొన్నూరులో ప్రస్తుత వైసీపీ ఎమ్ఎల్ఏ కిలారు వెంకట రోశయ్యపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని జగన్ స్వయంగా చేయించుకుంటున్న ఐప్యాక్ టీమ్ సర్వేలలోనే తేలిపోయిందట. యాంటీ ఇన్కమ్బెన్సీతో కిలారు రోశయ్యకి హ్యాండ్ ఇచ్చి, ఆ స్థానం నుండి అంబటి రాయుడుని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడట జగన్. పొన్నూరు టీడీపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగనున్నాడు ఆ పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర.. పొన్నూరులో నరేంద్రకి భారీ అనుచరగణం ఉంది.. గత ఎన్నికలలో జగన్ వేవ్తో ఆయన వెనకబడ్డారు. తాజాగా ఐ ప్యాక్ టీమ్తోపాటు ఇంటెలిజెన్స్ వర్గాలు చేసిన పలు సర్వేలలోనూ నరేంద్ర మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని రిపోర్టులు దక్కాయట.. దీంతో, కిలారు రోశయ్యని పక్కనపెట్టి, కొత్త అభ్యర్ధిని రంగంలోకి దించితే పరిస్థితి మెరుగవుతుందని లెక్కలు కట్టిన వైసీపీ హై కమాండ్… క్రికెటర్ అంబటిని రేసులోకి దించాలని యోచిస్తోందట..
జగన్ సర్కార్పై తీవ్ర ప్రజాగ్రహం, వ్యతిరేకత ఉన్న సమయంలో అంబటి రాంగ్ టీమ్ని ఎంచుకున్నాడనే చర్చ సాగుతోంది.. గత నాలుగేళ్లుగా జగన్ సర్కార్ అభివృద్ధిని పక్కనపెట్టడంతోపాటు, పోలవరం నిర్మించలేకపోవడం ఆయనకు మైనస్గా మారాయి.. ఇక, మూడు రాజధానులు, అభివృద్ది వికేంద్రీకరణ నినాదంతో రాష్ట్రాన్ని, అమరావతిని సర్వనాశం చేసి రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అందులోనూ అమరావతి రాజధానికి బోర్డర్లో ఉన్న పొన్నూరు అసెంబ్లీ లేదా రాజధాని కోర్ ఏరియాగా భావించే గుంటూరు ఎంపీ స్థానం నుండి బరిలోకి దిగుతానని అంబటి ఎంచుకోవడం ఘోర తప్పిదమని వ్యాఖ్యానిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన రాజకీయ అపరిపక్వతకి నిదర్శనం అని విశ్లేషిస్తున్నారు.. తన టీమ్మేట్ గౌతమ్ గంభీర్లా అంబటి కూడా పొలిటికల్గా సక్సెస్ కావాలంటే ఇప్పటికి అయినా ఆయన తన పార్టీ మార్చుకోవడం బెటర్ అని సలహాలు ఇస్తున్నారు కొందరు అభిమానులు.. రాజకీయ గోదాలోకి దిగకముందే అవుట్ అవబోతున్న ఈ మాజీ క్రికెటర్.. తన కొత్త ఇన్నింగ్స్ని ఎలా నెగ్గుకువస్తాడో చూడాలి.











