ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ఇప్పటికీ విషం కక్కుతూనే ఉంది… మూడు రాజధానుల పేరుతో అమరావతిని పట్టాలెక్కించిన మాజీ ముఖ్యమంత్రి జగన్.. అధికారం కోల్పోయినా ప్రపంచ బ్యాంక్కి లేఖలు పంపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.. తన టీమ్తోపాటు తన అనుయాయులతో జగన్… అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని, వరదలు వస్తే మునిగిపోవడం ఖాయమని మరోసారి ప్రపంచ బ్యాంక్ టీమ్కి లేఖలు పంపారనే అంశం వెలుగులోకి వచ్చింది..
తాజాగా, మరోసారి వైసీపీ విష, విధ్వంస రచనకు పూనుకుందనే చర్చ సాగుతోంది.. అమరావతి కోసం మరికొంత భూమిని ల్యాండ్ పూలింగ్లో సమీకరించడానికి భావిస్తోందని సమాచారం బయటకు వచ్చిందో లేదో, వైసీపీ వెంటనే అలెర్ట్ అయింది.. ఇప్పటికే ఉన్న భూమి సంగతేంటని, అమరావతి ఒక రియల్ ఎస్టేట్ పథకం అని, వేల ఎకరాలను తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేసింది.. వీటిపై తాజాగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు..
అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ప్రభుత్వం మరికొన్ని వేల ఎకరాల సమీకరణకు సిద్ధం అవుతోందని వివరించారు మంత్రి నారాయణ.. ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులు ఉంటేనే స్మార్ట్ ఇండస్ట్రీస్, ఎమ్ఎన్సీ కంపెనీలు రాష్ట్రానికి పరుగులు పెడతాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని, ఆ ఆలోచనతోనే తాము మరికొంత భూమిని పూల్ చేసే యోచనలో ఉన్నామని తెలిపారు మంత్రి.. అయితే, దీనిపై వైసీపీ రాద్ధాంతం మొదలు పెట్టింది.. లక్షల ఎకరాల భూమిని సమీకరించి ఏం చేస్తారని ప్రశ్నిస్తోంది..
మే 2వ తేదీన ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు.. అమరావతి పునః ప్రారంభానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు.. ఆ తర్వాత రాజధాని పనులు ఊపందుకోనున్నాయి.. 2019 నుండి 24 వరకు జగన్ సర్కార్… అమరావతిపై కక్షగట్టింది.. శ్మశానంలా మార్చేసింది… చంద్రబాబు విజయంతో అమరావతి పునరుజ్జీవనం దిశగా అడుగులు వేస్తోంది.. జగన్ టీమ్ ఈ దఫా ఎలాంటి కుట్రలు చేసినా ఈ ప్రాజెక్ట్ ఆగే పరిస్థితి కనిపించడం లేదు.. కేంద్రంలోని మోదీ సర్కార్ సైతం అమరావతికి కట్టుబడి ఉంది.. ఈ నిర్ణయాన్ని ప్రజలందరికీ తెలియపరచడానికే ఆయన కూడా అమరావతి కార్యక్రమాల పునః ప్రారంభానికి విచ్చేస్తున్నారు.. అందుకే, ఈ సారి వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా, వ్యూహాలు పన్నినా అవి నెరవేరవు.. పక్కా వ్యూహంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు… ఇదే జగన్ అస్తిత్వానికి సవాల్ విసరనుంది..