మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన గ్రాండ్గా స్టార్ట్ అయింది. డాలస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న లోకేష్..కీలక వ్యాఖ్యలు కల్పించారు. ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటామన్నారు. కష్టకాలంలో ఫ్యామిలీకి అండగా నిలిచారని లోకేష్ గుర్తు చేసుకున్నారు. స్పీడ్కు ఆంధ్రప్రదేశ్ను బ్రాండ్ అంబాసిడర్గా మార్చామన్నారు లోకేష్. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇక, వైసీపీపైనా సెటైర్లు వేశారు లోకేష్. వైసీపీ వై నాట్ 175 అంటే..ప్రజలు వై నాట్ 11 అన్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రవాసాంధ్రులకు ఏ కష్టమొచ్చినా APNRT అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఇక కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. విడాకులు, మిస్ ఫైర్లు, క్రాస్ఫైర్లు ఏమి ఉండవన్నారు. రెడ్బుక్ తన పని తాను చేసుకుపోతుందని మరోసారి స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదన్నారు లోకేష్. కూటమి ప్రభుత్వం ఎలాంటి కక్షసాధింపులకు పాల్పడటం లేదని చెప్పారు.
చంద్రబాబుని 53 రోజులు పాటు అక్రమంగా జైలులో ఉంచినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారని మరోసారి గుర్తు చేసుకున్నారు. 2019 నుంచి 2024 వరకు ఎంతటి విధ్వంస పాలన జరిగిందో అందరికీ తెలుసన్నారు లోకేష్. అందుకే సిద్ధం సిద్ధం అని బయలుదేరిన పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారని గుర్తు చేశారు. ఇక,ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయిందని..రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరగరాస్తామన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే..ఒక్క ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందన్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదమన్నారు.
లోకేష్ ఈ నెల 10 వరకు అమెరికా, కెనడాలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడం సహా రాష్ట్ర పారిశ్రామిక విధానాలను పారిశ్రామిక వేత్తలకు వివరించనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రముఖ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల సీఈవోలతో లోకేష్ భేటీ కానున్నారు. గత అమెరికా పర్యటనలో గూగుల్, ఇన్ఫోసిస్ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చిన లోకేష్..ఈ పర్యటనలోనూ భారీ ప్రాజెక్టులు తీసుకువస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది











