వైసీపీ అధినేత జగన్…. తన టీమ్లో కేసుల్లో ఇరుక్కున్న వారికి, పోలీసుల విచారణకు హాజరవుతున్న వారికి పక్కాగా తర్ఫీదు ఇచ్చి పంపుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.. పాపిరెడ్డిపల్లి హెలికాప్టర్ ఘటనలోనూ తాడేపల్లి ప్యాలెస్ తన మార్క్ స్క్రిప్ట్తో పక్కాగా ప్లాన్ చేశారని భావిస్తున్నారు.. హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలి, టేకాఫ్ తీసుకోవడం కష్టమని తెలిపి, జగన్ రోడ్డు మార్గాన బెంగళూరుకి చేరుకున్న ఎపిసోడ్లో పైలట్, కో పైలట్ని పోలీసులు విచారణకు పిలిచారు.. పైలట్ అనిల్ కుమార్ విచారణకు డుమ్మా కొట్టగా, కో పైలట్ శ్రేయస్ జైన్ హాజరయ్యారు..
ఈ విచారణలో కో పైలట్ శ్రేయస్ జైన్, తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ని పక్కాగా చదివి వినిపించి బయటకు వచ్చారని తెలుస్తోంది.. పోలీసులు అతడికి సుమారు 50 ప్రశ్నలు సంధించారు.. మెజారిటీ ప్రశ్నలకు కో పైలట్ శ్రేయస్ జైన్.. తెలియదు, మరిచిపోయా, గుర్తులేదు అనే వైసీపీ మార్క్ సమాధానాలే ఇచ్చాని సమాచారం.. 4-5 ప్రశ్నలకు మాత్రమే కో పైలట్ సూటిగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారని, 20కిపైగా ప్రశ్నలకు సైలెంట్గా ఉన్నారట.. శ్రేయస్ జైన్ సమాధానాలు విన్న పోలీసులు… ఇది పక్కా తాడేపల్లి స్క్రిప్ట్ అని ఓ అంచనాకి వచ్చారని తెలుస్తోంది..
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు ఫైల్ అయిన నేతలు, అధికారులు అంతా ఇదే పాట పాడుతున్నారు.. అదుర్స్ సినిమాలో హీరో ట్విన్కి ట్రయినింగ్ ఇచ్చి పంపినట్లు, ఒకే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు.. మూడే మూడు పదాలను బట్టీ కొట్టుకువచ్చి చెప్పినట్లు చెబుతున్నారు.. తెలియదు, గుర్తులేదు.. మర్చిపోయా.. ఈ మూడు పదాలనే తిప్పి తిప్పి విచారణలో బదులు ఇస్తున్నారని పోలీసులు వివరిస్తున్నారు…
శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డి పల్లిలో హత్యకి గురయిన లింగమమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడు జగన్.. వైసీపీ ఆధ్వర్యంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు.. అక్కడ హెలీకాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే వైసీపీ కార్యకర్తలు దూసుకొని వచ్చారు.. ఈ ఘటనలో హెలీకాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయిందని, పోలీసులు, ప్రభుత్వ భద్రతా వైఫల్యంతోనే ఇలా జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించారు.. దీంతో, తమ అధినేత హెలీకాప్టర్ వదిలి, రోడ్డు మార్గాన బెంగళూరు చేరుకున్నారని తెలిపారు.. విండ్ షీల్డ్ ఎలా దెబ్బతిన్నది, జగన్ రోడ్డు మార్గాన బయలుదేరిన వెంటనే హెలీకాప్టర్ గాలిలోకి ఎగరడం విశేషం.. ఈ మొత్తం ఎపిసోడ్పై తాజాగా పోలీసులు విచారణ ప్రారంభించారు.. ప్రస్తుతానికి కో పైలట్ విచారణకు హాజరవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.. ఆయనని సంధించిన ప్రశ్నలను, పైలట్కి లీక్ చేస్తే ఆయన నింపాదిగా వచ్చి సమాధానాలు ఇవ్వడానికి రెడీ అయ్యారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. పైలట్ వ్యూహాన్ని ముందుగానే అర్ధం చేసుకున్న పోలీసులు సరికొత్త ప్రశ్నలతో రెడీ అవుతున్నారని సమాచారం.. మరి, ఈ ఘటన ఎలాంటి టర్న్లు, ట్విస్ట్లు చోటు చేసుకుంటుందో ఆసక్తికరంగా మారింది..