(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీ కోదండరాముని నూతన విగ్రహం తయారీకి భక్తిపూర్వకంగా టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సమర్పించిన రూ. 101116/- చెక్కును దేవాదాయ శాఖ తిరస్కరించింది. ఈ సంఘటనపై అశోక్ గజపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవస్థానానికి దూరం చేసే ఉద్దేశంతోనే…
“మొదట నాకు నోటీసు కూడా ఇవ్వకుండా ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 28కు తూట్లు పొడుస్తూ నన్ను అనువంశిక ధర్మకర్తగా తొలగించారు. ఇప్పుడు వ్యవస్థాపక కుటుంబ సభ్యునిగా శ్రీ రాముని కొత్త విగ్రహాల తయారి నిమిత్తం నేను భక్తిపూర్వకంగా ఇచ్చిన కానుకను తిరస్కరించారు. చూడబోతే వ్యవస్థాపక కుటుంబాన్ని దేవస్థానానికి దూరం చేసే ఉద్దేశ్యంలో ఈ ప్రభుత్వం ఉన్నట్లుగా అనిపిస్తోంది.
… ట్విట్టర్లో అశోక్ గజపతి రాజు
First, they unilaterally dismiss me as hereditary trustee / Chairman without as much as a notice in complete contravention of section 28. Now, they reject my offerings to the Lord as a representative of the founder family for the vigrahas. pic.twitter.com/19GANVZRpC
— Ashok Gajapathi Raju (@Ashok_Gajapathi) January 16, 2021