ప్రవీణ్ రావు, అతని సోదరుల కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరస్టైన సంగతి తెలిసిందే. కిడ్నాప్ విచారణలో భాగంగా అఖిలప్రియను మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. కస్టడీ ముగిసిన అనంతరం చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. బెయిల్ పిటిషన్పై విచారించిన సికింద్రాబాద్ కోర్టు.. తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
అఖిలప్రియ తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లాయర్, ఆమె ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు.











