ప్రకాశం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సమయంలో ఒంగోలులో ఎన్టీఆర్ పేరుపై ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నేతలు ఎన్టీఆర్ అభిమానుల పేరుతో కొత్త డ్రామా మొదలు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. లోకేష్ పాదయాత్రలో కొందరు దురుద్దేశంతో ఈ ఫ్లెక్సీలు పెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. ‘నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్..అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే’ అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర, ఫ్లైఓవర్ కింద, చర్చి సెంటర్, కనిగిరి కింద ఇలా పట్టణంలోని పలుచోట్ల ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. పోలీసులు ఈ ఫ్లెక్సీలను తొలగించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఈ ఫ్లెక్సీలు పెట్టారని కొందరు అంటున్నారని, అయితే వైసీపీ నేతలు మాత్రం ఇలా ఫ్లెక్సీలు పెట్టి పార్టీలో వివాదం సృష్టించాలని చూస్తున్నారని తెలుస్తోంది. .
నారా లోకేష్ పాదయత్రకి వస్తున్న ప్రజాదరణ చూసి , వైసీపీ నాయకులూ తట్టుకోలేక, లేనిపోని కుతంత్రాలు చేస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నారు. లోకేష్ పాదయత్రకి ప్రకాశం జిల్లాలో బ్రహ్మరథం పడుతున్నారు.. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. లోకేష్ పాదయాత్ర దెబ్బకి, వైసీపీ అధిష్టానం ఉలిక్కి పడుతోందని తెలుస్తోంది. అందుకే లోకేష్ పాదయత్రకి లేనిపోని అవాంతరాలు కలిగిస్తున్నారని సమాచారం..