భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బాస సత్యనారాయణరావును తొలగిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాల వల్ల బాస సత్యనారాయణరావును తొలగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడిగా గంగిడి క్రిష్ణారెడ్డిని నియమించారు. గంగిడి క్రిష్ణారెడ్డి కూడా పార్టీ మూలాలు కలిగి, విధేయ నేతగా పనిచేస్తున్నారు. గతంలో తమిళనాడు రాష్ట్ర ఏబీవీపీ కార్యదర్శిగా పనిచేశారు.
బాస సత్యనారాయణ రావు ప్రవర్తనే ఆయన తన పదవి కోల్పోవడానికి కారణంగా తెలుస్తోంది. ఆయన ఓ మహిళతో సరసమాడుతున్న వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తమ పార్టీకి చెందిన కార్యకర్తతో రాసలీలలు సాగించినట్లు అందులోని వ్యక్తుల మాటలు, వీడియో ద్వారా తెలుస్తోంది.
ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విశేషం. అంతేకాకుండా బాస సత్యనారాయణరావు, సదరు మహిళ ఇష్టపూర్వక సంబంధాన్ని కలిగివున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయమై బాస సత్యనారాయణరావు గాని సదరు మహిళ గానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.