తమిళ్ హీరోలకు వరుస బాంబ్ బెదిరింపు కాల్స్ ఎక్కువ అయ్యాయి. మొదట స్టార్ హీరో రజనీకాంత్ కు, మరో స్టార్ హీరో విజయ్ కు బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. వారు పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడంతో పోలీసులు కంగారుపడి వెంటనే బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి ఇంట్లోనూ, చుట్టుపక్కల తనిఖీ చేసారు కానీ ఏమీ దొరకలేదు. ఇటీవల స్టార్ హీరో సూర్యకు కూడా బాంబ్ బెదిరింపు కాల్ వచ్చాయి. అతని కార్యాలయంలో బాంబు ఉందంటూ వచ్చిన ఫేక్ కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే డాగ్ స్వ్కాడ్ ను తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా తమిళ సీనియర్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్ కాంత్, యంగ్ హీరో ధనుష్ లకు కూడా బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకు కాల్ చేసి హీరో ధనుష్, విజయ్ కాంత్ ఇళ్ళలో బాంబ్ పెట్టినట్లు తెలిపాడు. ఈ ఫోన్ తో అప్రమత్తమైన పోలీసులు వారి ఇళ్లకు చేరుకొని జాగిలాలతో గాలింపు చేపట్టారు. అక్కడ పోలీసులకు ఏమి దొరక్కపోవడంతో అదీ ఫేక్ కాల్ అని నిర్దారించుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సినీ ప్రముఖులకు వరుస బాంబ్ బెదిరింపు ఫేక్ కాల్స్ రావడంతో ఈ విషయాన్నీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తున్న వ్యక్తులను త్వరగా పట్టుకొని వారికి తగిన శిక్ష వేయాలని హీరోల అభిమానులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. తమ హీరోలకు తగిన బందోబస్తు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ హీరోలకు ఏమైనా హాని జరిగితే ఊరుకోమని వాపోతున్నారు. సినిమా ప్రముఖుల సైతం ఈ ఫేక్ కాల్స్ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నారు. ధనుష్ ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇక విజయ్ కాంత్ ఇటీవలే కోవిడ్-19 బారి నుంచి కోలుకున్నారు.











