రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వినూత్న రూపంలో ముందుకు దూసుకుపోతోంది. ప్రముఖుల నుంచి కూడా దీనికి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని సుందర్ నగర్లోని తన నివాసంలో మొక్కలు నాటారు క్రికెట్ దిగ్గజం, భారతదేశం క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వాతావరణ కాలుష్యం తగ్గి మంచి వాతావరణం కావాలని ఆశిద్దామని అన్నారు. అందుకోసం భారతీయులంతా బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించడం మన అందరి బాధ్యత అన్నారు.
కడప సాక్షిగా ఒక్కటయిన ఎస్సీ వర్గాలు.. నామినేషన్ రోజే జగన్కి షాక్..!!
కడప జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డికి సహాయ...